DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భాగ్యలక్ష్మి గుళ్లో బండి కొట్టిన గంట మారుమ్రోగింది

*పాతబస్తీ లో హోరెత్తిన జైశ్రీరామ్, ఎగిరిన కాషాయం* 

*20 నిమిషాలు ఇస్తే అన్నవాడి కోసం 3 గంటలు వెయిటింగ్* 

*40 రోజుల బీజేపీ ప్రజా సంగ్రామయాత్ర లో పోటెత్తిన జనం* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*భాగ్యనగరం / విశాఖపట్నం, ఆగస్టు 28, 2021 (డిఎన్ఎస్):* భాగ్యనగరం లోని భాగ్యలక్ష్మి అమ్మవారి

ఆలయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కొట్టిన గంట రాష్ట్రవ్యాప్తంగా మారుమ్రోగింది. తెలంగాణాలో టీఆరెస్ పార్టీ చేస్తున్న నిరంకుశ, కుటుంబ పాలనా నుంచి తెలంగాణ కు విముక్తి కల్గించాలని ఏకైక సంకల్పంతో బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శనివారం భాగ్యనగరం లోని పాతబస్తీ లో ఉన్న భాగ్యలక్ష్మి

అమ్మవారి ఆలయం నుంచి ఆరంభమైంది. ప్రారంభోత్సవ సభకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, జాతీయ నేతలు, రాష్ట్ర స్థాయి నేతల నుంచి సాధారణ బీజేపీ కార్యకర్త వరకూ ప్రత్యక్షంగా పాల్గొనేందుకు పాతబస్తీకి చేరుకున్నారు. దీంతో పాతబస్తీ మొత్తం కాషాయమయంగా మారిపోయింది. కిలోమీటర్ల మేర ప్రతి వీధిలోనూ కాషాయ జండా రెపరెపలాడింది. సుమారు 40

రోజులకు పైగా సాగనున్న ఈ యాత్ర తెలంగాణాలో ప్రధాన కేంద్రాల మీదుగా జరుగుతుంది. 

గతంలో ఒకడు 20 నిముషాలు సమయం ఇస్తే. .మొత్తం హిందువు అనేవాడు లేకుండా చేస్తా అని ప్రేలాపలనాలు చేసిన పాతబస్తీ లోనే వేలాదిగా హిందువులు సుమారు నాలుగు గంటల సమయం వేచి చూసారు. ఆ వార్నింగ్ ఇచ్చిన వాడు ఎంతకీ రాకపోయే సరికి ప్రజా సంగ్రామ

యాత్ర మొదలు పెట్టేసారు.    

మొదటి రోజు ప్రజా సంగ్రామ యాత్రలో 10 కిలోమీటర్ల దూరం నడిచి, మెహదీపట్నం చేరుకున్నారు. అడుగడుగునా యాత్రకు ప్రజలు నీరాజనం పట్టారు. మార్గం వెంబడి ప్రజలు సంజయ్ ను కలిసి, తమ సమస్యలను తెలియచేయడం, కరచాలనం చెయ్యడం కోసం బారులు తీరారు. 
మొదటి రోజు భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మొదలై మదీనా,

అఫ్జల్ గంజ్, బేగం బజార్, ఎం జె మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డి కా పూల్, మాసాబ్ ట్యాంక్ మీదుగా మెహదీపట్నం చేరుకుంది. రాత్రి మెహదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలోని శిబిరంలో బస చేసారు. 

రెండవ రోజు మెహదీపట్నం, టోలీ చౌక్, షేక్ పెట్, గోల్కొండ కోట, లంగర్ హౌస్, బాపు ఘాట్ వద్ద

ముగుస్తుంది. 

ఈ ప్రజా ఉద్యమం లో పాల్గొనదలచిన వారు 6359 119 119 నెంబర్ కు మిస్డ్ కాల్ చెయ్యాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ యాత్ర కమిటీ తెలియచేసింది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam