DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రోడ్డు మధ్యలో గోతులు తీసి వదిలేస్తే. .ఇలా చేస్తే సరి

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 29, 2021 (డిఎన్ఎస్):* అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రజల కోసం రోడ్ల మరమ్మత్తులు అని చెప్పి, సగంలో రోడ్ల మధ్యలో గోతులు త్రవ్వి అలాగే తీసి వదిలేస్తున్నారు. వీటి కారణంగా రహదారి లో వెళ్లే ప్రజలు, వాహనదారులు ఈ గోతుల్లో పడి ప్రమాదాలకు గురిఅవుతున్నారు. వీటిపై ఎంతమైంది

ఎన్ని ఫిర్యాదు చేసినా, వీటికి భాద్యత వహించాల్సిన ప్రభుత్వాలు, సదరు కాంట్రాక్టర్లు కళ్ళు మూసుకు పోయి మొద్దు నిద్ర పోతున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే. . రహదారిపై గోతులు, పెద్ద గొయ్యి లు లేని రోడ్లు ఈ రాష్ట్రంలో లేకపోవడమే.

ఇలాంటి దిక్కుమాలిన దౌర్భాగ్య స్థితి లో ఉన్న రోడ్ల పై రహదారి ప్రమాదాలు జరగకుండా

ప్రజలు తమని తాము రక్షించుకోడానికి, ఒక ఊళ్ళో ప్రజలు బృహత్తరమైన కార్యక్రమం మొదలు పెట్టారు. 

తమ ఊళ్ళో రోడ్డు మీద త్రవ్వేసిన గోతుల్లో మొక్కలు నాటుతున్నారు. తద్వారా కాలుష్యం నుంచి కాపాడుకోడమే కాక, ఇక్కడ గొయ్యి ఉంది అని ప్రజలకు తెలుస్తుంది అని జాగ్రత్తలు చెప్పడం అవుతుంది. 
వీళ్ళు స్థానిక ప్రజా

ప్రతినిధులకు, అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోకుండా నిద్రపోతున్న సిబ్బంది, కాంట్రాక్టర్లు వీళ్ళు నాటిన మొక్కల్ని తొలగించడానికి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను, పాలకులను ఈ గోతుల గురించి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు. 

బాధ్యతారాహిత్యంతో ఉన్న ప్రభుత్వ అధికారులకు, కాంట్రాక్టర్లకు తగిన

గుణపాఠం చెయ్యడానికి ఇదొక్కటే మార్గం అని భావిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam