DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ రాజధానిగా వైజాగ్ ను కేంద్రం ఆమోదించిందా?

http://164.100.24.220/loksabhaquestions/annex/176/AS84.pdf

 

 

">

*లోక్ సభ జవాబుల్లో ఏపీ కాపిటల్ గా వైజాగ్. .. పేరు. .*

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, ఆగస్టు 29, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా వైజాగ్ ను కేంద్రం ఆమోదించిందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం గత నెల్లో కేరళ ఎంపీ ఒకరు లోక్ సభ లో పెట్రోల్, డీజిల్ ధరలపై అడిగిన ఒక

ప్రశ్నకు వ్రాత పూర్వక సమాధానం రాష్ట్ర పేర్లు, రాజధానుల్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి అంటూ జవాబు ఇచ్చారు. ఈ జాబితాలో  ఆంధ్ర ప్రదేశ్ పేరు ఎదురుగా రాజధానిగా వైజాగ్ అని ఉండడం గమనార్హం. 

కేరళ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ కుంభకుడి సుధాకరన్, ప్రద్యుత్ బోరోలోయ్ లు అడిగిన స్టార్డ్ ప్రశ్న (ప్రశ్న నెంబర్ 84 ) కు కేంద్ర ఇంధన

శాఖా మంత్రి హర్దీప్ సింగ్ జులై 26, 2021 న ఒక్కో రాష్ట్రంలో 2020, 2021 ల్లో ధరల వివరాలు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఈ జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ పేరు కు ఎదురుగా రాజధానిగా వైజాగ్ పేరు నమోదు అయి ఉంది.      

అంటే వైజాగ్ ను రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్టేనా? కేంద్రం క్యాబినెట్, గెజిట్ నోటిఫికేషన్, లాంటి అధికారిక

ఆమోదాలు లేకుండా లోక్ సభ జాబితాలోకి వైజాగ్ పేరు వెళ్లే అవకాశం లేదు. 

ఇది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున గానీ, అధికార పార్టీ వాళ్ళు గానీ, అధికార పార్టీ ఎంపీ లు గానీ, ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు గానీ ప్రకటించక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. 

పొరబాటున లోక్ సభ జాబితాలో వైజాగ్ పేరు ఏపీ

రాజధానిగా నమోదు అయ్యిందా అనే అనుమానం కూడా లేకపోలేదు. ఒకవేళ అదే నిజమైతే ఈ మార్పు ప్రక్రియ ఎప్పుడు జరిగిందో తెలియాల్సి ఉంది. 

లోక్ సభ వెబ్సైటు లో కూడా ఈ ప్రశ్న నిక్షిప్తం చెయ్యబడి ఉంది. 

link : http://164.100.24.220/loksabhaquestions/annex/176/AS84.pdf

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam