DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోల్కొండ కోట కట్టింది నిజాం అయ్యనా?: శివాలెత్తిన బండి

*త్వరలోనే గొల్లకొండ పై కాషాయ జెండా ఎగురుతుంది*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*భాగ్యనగరం / విశాఖపట్నం, ఆగస్టు 29, 2021 (డిఎన్ఎస్):* గోల్కొండ కోటను కట్టించింది నిజాం అయ్యనా...? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ టీఆరెస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు కు సూటి ప్రశ్న వేశారు. 
రానున్న రెండు

సంవత్సరాల తర్వాత గొల్లకొండ ( గోల్కొండ ) పై ఎగురబోయేది కాషాయ జెండాయే నని బండి సంజయ్ ప్రకటించారు. భాగ్యనగరం లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి శనివారం మొదలైన ఈ ప్రజా సంగ్రామ యాత్ర లో రెండవ రోజు బండి శివాలెత్తిపోయారు. అక్రమాలకు, నిరంకుశ, కుటుంబ పాలన చేస్తున్న టీఆరెస్ పార్టీ ని తూర్పారబట్టారు. 

రానున్న

ఎన్నికల లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ  తెలంగాణ లో ప్రజలని చైతన్య పరిచేందుకు విస్తృత పర్యటన చేస్తున్నారు. సుమారు 40 రోజుల పాటు సాగే ఈ యాత్ర తెలంగాణ లోని ప్రధాన కేంద్రాలలో సాగనుంది. 
ప్రజా సంగ్రామ పాదయాత్ర యాత్రలో బండి సంజయ్ సంధించిన అస్త్రాలు ఇవే. .. 

గోల్కొండ కోటను కట్టించింది నిజాం

అయ్యనా...? 

గోల్కొండ కోటను కట్టించింది కాకతీయ రాజులు..

అది గోల్కొండ కాదు...గొల్ల కొండ

రెండు సంవత్సరాల తర్వాత గొల్లకొండ ( గోల్కొండ ) పై కాషాయ జెండా ఎగరవేస్తాం.

వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దే నిర్వహిస్తాం.

గోల్కొండ కోటపై

కాషాయ జెండా రెపరెపలాడిస్తాం.

మేము గర్జించేది జై శ్రీరాం... మా దేవుళ్లను తిడితే... వాళ్ళ చెవుల్లోంచి రక్తం వచ్చేలా జై శ్రీరాం నినాదాలతో గర్జిస్తాం

బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు.

'ట్రిపుల్ తలాక్' చట్టాన్ని తెచ్చి, ముస్లిం మహిళలని కాపాడుతున్నాం

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే

తెలంగాణలో కార్యక్రమాలు అమలవుతున్నాయి.

కేంద్రప్రభుత్వం అందరికోసం రోడ్లు వేస్తుంది... దానిపై ఒక్క హిందువులే ప్రయానిస్తున్నారా? ముస్లింలు, క్రైస్తవులు ప్రయాణించడంలేదా?

కొరోనా అదుపుచేయడానికి ఫ్రీ వాక్సిన్ ఇస్తున్నది కేంద్రమేనన్నారు.

హిందువులకు ఏ కష్టమొచ్చినా బీజేపీ అండగా

ఉంటుంది.

2023లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది.

ఎంఐఎం గుండాల చేతులో పాపన్న, నందరాజ్ గౌడ్ ల హత్యలు జరిగాయి... వారి బలిదానాలను వృధా కానివ్వం.

గుంట నక్కలు, దున్నపోతుల్లా కేంద్ర నిధులను కేసీఆర్ కుటుంబం దోచుకుంటున్నారు.

కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా... హుజూరాబాద్ ఎన్నికలో ఈటల

గెలుపు ఖాయం.

హుజూరాబాద్ గడ్డమీద కాషాయ జెండానే ఎగురుతుంది.

ఎట్టి పరిస్థితుల్లో రంగురంగుల జెండా ఎగరదు అని బహిరంగంగా ప్రకటించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam