DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేడు వైష్ణవ ఆలయాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 31, 2021 (డిఎన్ఎస్):* విశిష్టాద్వైత సంప్రదాయం లో పర్వదినోత్సవాలు, వేడుకలు అన్నీ నక్షత్ర ఆధారంగా నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ కృష్ణ పరమాత్మా ఆవిర్భవించిన రోజు శ్రావణ మాసం లో రోహిణి నక్షత్రం రోజు, దీన్ని శ్రీవైష్ణవ సంప్రదాయం లో శ్రీ జయంతి అని పేరు. ఇతర

సంప్రదాయపరులు శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి గా వేడుకలు నిర్వహిస్తుంటారు. 
అయితే శ్రీవైష్ణవ సంప్రదాయం లో శుభ కార్యక్రమాలను నక్షత్రం ఆధారంగానే జరుపుకోవడం ఆనవాయితీ. ఈ వైభవాన్ని అన్ని శ్రీవైష్ణవ క్షేత్రాలు, సంప్రదాయ పరుల ఇళ్లలోనూ తప్పని సరిగా వైభవంగా జరుపుకునే వేడుక. ఈ సందర్భాన్ని

పురస్కరించుకుని దేశ, విదేశాల్లోని అన్ని శ్రీవైష్ణవ క్షేత్రాలు, సంప్రదాయపరుల ఇళ్లలోనూ అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తుంటారు..
విశాఖ నగరం పరిధిలోని సింహాచల క్షేత్రం, పోర్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయం, సగర్నగర్ శ్రీరామాలయం, మింది ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తదితర అన్ని క్షేత్రాల్లో మంగళవారం సాయంత్రం ఈ వేడుకలు

జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ జరిగే ఈ వేడుకల్లో శ్రీకృష్ణ సంబంధమైన అన్ని గ్రంథ పారాయణాలు, ప్రవచనాలు, ఉట్టి కొట్టడం, సహా 9 లేదా 18 లేదా 36 రకాల పిండివంటలతో శ్రీకృష్ణ పరమాత్మకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. 

ముకుందమాల స్తోత్ర పఠనం, భగవద్గీత పారాయణం, శ్రీమద్భాగవత గ్రంథ పఠనం

వంటివి చేయడం జరుగుతుంది. 
ఈ వేడుకల్లో ఇంటిలో ప్రతి సభ్యుడు తప్పని సరిగా పాల్గొనడం ఆనవాయితీ. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam