DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 7 నుంచి దసరా నవరాత్రులు 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, ఆగస్టు 31, 2021 (డిఎన్ఎస్):* విజయవాడ లోని ఇంద్రకీలాద్రి క్షేత్రం పై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. సాక్షాత్తు రాజరాజేశ్వరి అమ్మవారి కనకదుర్గ రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్న క్షేత్రం ఇది.

నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కోరోజు ఒక ప్రత్యేక అలంకరణ జరుగుతుంది. అక్టోబర్ 7న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి, 8న బాలా త్రిపుర సుందరీ దేవిగా, 9న గాయత్రీదేవిగా, 10న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 11న అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
 అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మహాలక్ష్మిదేవిగా

అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 12న సరస్వతీదేవిగా, 13న దుర్గాదేవిగా, 14న మహిషాసురమర్ధినిగా, 15న రాజరాజేశ్వరి దేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam