DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా రమ్య తిరుమల ఆలయ ముఖద్వార శంకుస్థాపన  

*(DNS report : వెంకటాచార్యులు S, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)* 

*శ్రీకాకుళం, సెప్టెంబర్ 01, 2021 (డిఎన్ఎస్):* పిలిచినా వెంటనే పలికే కోనేటిరాయుడు శ్రీ వెంకటేశ్వరుడు  కొలువైన శ్రీ రమ్య తిరుమల ఆలయంలో ముఖ ద్వార శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీకాకుళం మెయిన్ రోడ్ ( ఆరావళి రోడ్) లోని శ్రీ రమ్య తిరుమల ఆలయం ఓ బుధవారం

శాస్త్రోక్తంగా భూమి పూజ ను అర్చకులు కరి రంగనాధ వేణుమాధవాచార్యులు చేపట్టారు. ఈ ముఖద్వార నిర్మాణం జరగాలని, కొరోనా మహమ్మారి  బారి నుంచి మానవాళిని రక్షించాలని కోరుతూ స్వామిని  ప్రార్థిస్తూ గత జులై నెల 10 వ తేదీ పునర్వసు నక్షత్రం నుంచి ఆగస్టు 5 వ తేదీ పునర్వసు నక్షత్రం వరకూ 27 రోజుల పాటు శ్రీమద్రామాయణ పారాయణ దీక్షగా

పారాయణ నిర్వహించారు. స్వామి అనుగ్రహం ఫలితంగా సెప్టెంబర్ 1 వతేదీన ముఖద్వార నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని అర్చకులు తెలియచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.టి.పి. రామానుజాచార్యులు, ఎస్. వెంకటాచార్యులు, ఇతర వైదిక ప్రతినిధులు పాల్గొన్నారు. 

శ్రీ శ్రీ సంప్రదాయ సాహిత్యరంగం సంస్థ చే నిర్వహించబడుతున్న రమ్య

తిరుమల ఆలయంలో ప్రతి రోజు సుందరకాండ పారాయణ, శ్రావణ మాసం నెల రోజుల పాటూ ప్రత్యేక కుంకుమార్చనలు, ప్రతి వారం స్వామి కి అభిషేకం జరుపుతున్నామన్నారు. ప్రతిరోజూ నిత్య అన్న ప్రసాద వితరణ, నిరాశ్రయులకు, ఆశ్రమాల్లో ఉండేవారికి పేదలకు వస్త్రాల అందజేత తదితర సేవా కార్యకమాలు చేపడుతున్నారు.    

ఆలయ అభివృద్ధి కోసం, ఆలయం

లో జరిగే వైదిక కార్యక్రమాల్లోను, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు ఆలయ అర్చకులు రంగనాధ వేణుమాధవాచార్యులు  ను +91 94400 61940 నెంబర్ లో సంప్రదించవచ్చు. విరాళాలను  ఫోన్ పే  నెంబర్ (+91 94400 61940 ) కు గానీ, యూనియన్ బ్యాంకు అకౌంట్ నెంబర్ :211112010000017 , IFSC కోడ్: UBIN 0821110  కు గానీ పంపవచ్చు అని తెలియచేసారు.        

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam