DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కృష్ణ నామంతో మారుమ్రోగిన పిల్లలమర్రి దేవాలయాలు

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 01, 2021 (డిఎన్ఎస్):*  శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం లో సర్వమానవాళిని పరిరక్షించేందుకు శ్రీకృష్ణ పరమాత్ముని రూపం lo ఈ నేలపై ఆవిర్భవించిన శ్రీమహావిష్ణువు కు దేశ విదేశాల్లో అత్యంత భక్తి శ్రద్దలతో సేవా కైంకర్యాలు జరిగాయి. మంగళవారం రోహిణి

నక్షత్రం కావడంతో శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణాష్టమి ని శ్రీ జయంతి పర్వదినోత్సవం గా పిలుస్తూ ఈ సంప్రదాయా పరులందరూ గృహాల్లోనూ, దేవాలయాల్లోనూ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు.

దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి నందు దివ్య సాకేత చారిత్రాత్మక

దేవాలయఓ లోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం లో ఈ వేడుకలు ఆలయ అర్చకులు ముడుoభై రఘువర కృష్ణమాచార్యుల సారధ్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం ధృవ మూర్తి కి పంచామృత అభిషేకం, అలంకరణ, విశేష అర్చనలు జరిగాయన్నారు. సాయంత్రం భారీ భక్త జన సందోహం నడుమ శ్రీ రుక్మిణీ సత్యభామా

సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం నభూతో నభవిషత్ అన్న రీతిలో జరిగిందన్నారు. 

కార్యక్రమం లో దేవాలయ సమన్వయ కమిటీ రాపర్తి సైదులు - పద్మ మరియు అంకం సంతోష్ - సంగీత దంపతులు కళ్యాణం లో ప్రత్యక్షంగా పాల్గొన్నారన్నారు. 

బాలబాలికలు శ్రీకృష్ణ, గోపికా వేషధారణలో పాల్గొని కోలాటం, నృత్యాలతో శ్రీకృష్ణ

పరమాత్మకు విశేష నీరాజనం అందించారన్నారు. కార్యక్రమం లో ఉట్టి కొట్టే క్రీడలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని, ఆనందించారని తెలిపారు.  కార్యక్రమం లో సతీశ్, పుష్ప వెంకన్న, నాగరాజు, చినమల్లయ, గోపి, బిక్షం తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam