DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల లో సర్వ దర్శనంపై త్వరలో తీపి కబురు

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 01, 2021 (డిఎన్ఎస్):*  తిరుమల లో శ్రీవారి సర్వదర్శనం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియచేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీ‌కృష్ణాష్టమి

ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవ నేడు టీటీడీ లాంఛ‌నంగా ప్రారంభించింది. ప‌విత్ర‌మైన కృష్ణాష్ట‌మి ప‌ర్వ‌దినం రోజున న‌వ‌నీత సేవ‌ను ప్రారంభించుకోవ‌డం మ‌నంద‌రి అదృష్ట‌మ‌న్నారు వైవీ సుబ్బారెడ్డి. క‌లియుగం ఉన్నంత‌కాలం ఈ సేవ

కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ఇందుకోసం గోశాల‌లో దేశవాళీ గోవుల పాల‌తో పెరుగు త‌యారు చేసి దాన్ని సంప్ర‌దాయబద్ధంగా క‌వ్వాల‌తో చిలికి వెన్న తీస్తార‌ని చెప్పారు. భక్తుల మనోభావాలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలియజేశారన్నారు.

ప్రభుత్వ సహకారంతో 35 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు

చేశామన్నారు టీటీడీ ఛైర్మన్. రెండో దశలో ఉచిత బస్సులను సైతం ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చుతామన్నారు. మూడో దశలో ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మారుస్తామన్నారు. వంద బస్సులను తిరుమల తిరుపతి మధ్య నడిపేందుకు సీఎం జగన్ అంగీకరించారన్నారు. వాహనాలు విరాళంగా ఇవ్వదలచిన దాతలు, ఎలక్ట్రిక్ వాహనాలు ఇవ్వాలని ఛైర్మన్

సూచించారు. మూడు దశలు పూర్తి చేసిన తర్వాత తిరుమలలో నడిచే టాక్సీలను కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చుతామన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam