DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ కై భారత్ తో ఆస్ట్రేలియా ఒప్పందం

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 01, 2021 (డిఎన్ఎస్):* ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణ కోసం భారత్ దేశం తో ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకోబోతోందని ఆస్ట్రేలియా వైస్ కాన్సుల్, రెండవ కార్యదర్శి ఆండ్రూ కొలిస్టర్ తెలియచేసారు.  
పర్యావరణ హిత సంస్థ ‘ ఇండియా యూత్ ఫర్ సొసైటీ’  పదవ వార్షిక సమావేశం

విశాఖలో ఘనంగా నిర్వహించారు. సాగర్ నగర్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆస్ట్రేలియా వైస్ కాన్సుల్, రెండవ కార్యదర్శి ఆండ్రూ కొలిస్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సంస్థ అధ్యక్షుడు జగదీష్ కోలీస్టర్ ను సాదరంగా ఆహ్వానించి తమ కార్యావర్గాన్ని, వాలంటీర్లను పరిచయం చేశారు. ఇండియా యూత్ ఫర్ సొసైటీ కార్యదర్శి

హర్షవర్ధన్ గత పదేళ్ళలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణలో భాగంగా అవగాహన పెంపునకు,  నిర్వహించిన క్షేత్రస్థాయి కార్యక్రమాలను వివరించారు. తమ సంస్థ ప్రతినిధులు, వాలంటీర్ల సాయంతో ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణ, రీసైక్లింగ్, చెరువులు, బీచ్ ప్రాంతాలను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. జీవీఎంసీ

సహకారంతో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ పార్లర్ వంటి కార్యక్రమాలకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. 

ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆండ్రూ కొలిస్టర్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా దేశం ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణ నిమిత్తం భారత్ దేశం తో కలిసి ఒప్పందం చేసుకోబోతోంది అని తెలియ చేశారు. ఐ వై ఎఫ్ ఎస్ సంస్థ కార్యక్రమాలను

అభినందిస్తూ ఆస్ట్రేలియా కాన్సులేట్ తరుపున సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ఈ సంధర్భంగా వాలంటీర్లను, సంస్థ ప్రతినిధులను కొలీస్టర్ సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ  ఆవిర్భావ అధ్యక్షుడు ఎండ్రెడ్డి అప్పల రెడ్డి,  సలహాదారులు సోహన్ హటంగడి, కంట్రెడ్డి రామన్న పాత్రుడు, బీఎస్ శాస్త్రి,  సంస్థ ప్రతినిధులు శరత్ చంద్ర,

బోనం ప్రసాద్, గంజివరపు శ్రీనివాస్, వీరబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొని సంస్థతో తమకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam