DNS Media | Latest News, Breaking News And Update In Telugu

19 న పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం 

*కోవిడ్ నిబంధనలతో అమ్మవారి ఉత్సవాలు: ఈఓ* 

*విజయనగరం, సెప్టెంబర్ 02, 2021 (డిఎన్ఎస్):*  ఉత్తరాంద్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు తేదీలను పైడితల్లి దేవస్థానం సహాయ కమీషనర్ బిహెచ్ వి ఎస్ ఆర్ కిషోర్ కుమార్ ప్రకటించారు. ఈ ఉత్సవాలు కోవిడ్ నిబంధనల మధ్య జరుగుతాయని పేర్కొన్నారు.  గురువారం విజయనగరం లోని

పైడితల్లి అమ్మవారి దేవస్థానం కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఈ నెల 23 తేదీ మండల దీక్షలతో ఉత్సవాలు ప్రారంభమై నవంబర్ 3 చండీహోమం తో   వరకు పండగ జరుగు తుందన్నారు. పండుగలో ప్రధాన ఘట్టమైన  తోలేళ్ల ఉత్సవం అక్టోబర్ 18న ,సిరిమాను అక్టోబర్19న జరుగుతుందని తెలిపారు. సెప్టెంబరు23న మండల దీక్షలు

ప్రారంభం అవుతాయని తెలిపారు. 29న పందిరిరాట, అక్టోబర్ 13న అర్ధ మండల దీక్షలు,18న తోలేళ్ల ఉత్సవం,19న సిరిమాను,26న తెప్పోత్సవం,31న కలసి జ్యోతి,నవంబర్2న ఉయ్యాలకంబాల ఉత్సవం,నవంబర్3న చండీహోమం,పూర్ణాహుతి తో ఉత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు,జిల్లా అధికారులు సలహాలు,సూచనలతో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు

జరగనున్నాయని తెలిపారు.  ప్రజలంతా సహకరించి, ఉత్సవాలను ప్రశాంతగా, విజయవంతంగా జరిగేలా  చూడాలన్నారు. ఈ సమావేశంలో పూజారి బి.వెంకటరావు,వేదపండితులు   టి.రాజేష్ బాబు,ఏ.సాయి కిరన్ శర్మ, దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ డి.రామా రావు తదితరులు  పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam