DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పురిటిగుడ్డుకు ప్రాణం పోసిన మానవతామూర్తి ఈ ఖాకీ 

*రోలుగుంట ఎసై సతీష్ కు DNS మీడియా అభినందనలు*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 03, 2021 (డిఎన్ఎస్):* పోలీస్ వ్యవష్ట ఉన్నది ప్రజా రక్షణకే అనే నినాదం గతంలో ఎప్పుడో వినిపించేది. అప్పుడే పుట్టిన పురిటి గుడ్డుకు ప్రాణం పోసి అయితే అది అక్షర సత్యం అని నిరూపించారు విశాఖ జిల్లా ఎసై నాగ

సతీష్. 

కేవలం కాఠిన్యం మాత్రమే చూసే ఖాకీ దుస్తుల వెనుక ఎంతో కారుణ్యం, మానవతా కూడా ఉంటుంది అని నిరూపించారు. విశాఖ జిల్లా లోని రోలుగుంట ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న నాగ సతీష్ కు గురువారం విశాఖ జిల్లా రోలుగుంట మండలం కంచుగుమలు పంచాయతీ శివారు భోగాపురం పంట పొలాలకు వెళ్లే రోడ్డుపై ఒక పసి బిడ్డను వదిలి

పెట్టారు అంటూ స్థానికులు సమాచారం అందించారు. దీంతో తక్షణం స్పందించిన సతీష్, ఘటన స్థలానికి చేరుకోగా కనిపించిన దృశ్యానికి ఎంతో ఆవేదన చెందారు.  

భోగాపురం పంట పొలాలకు వెళ్లే రోడ్డుపై అప్పుడే పుట్టిన బిడ్డను ఎవరో ముళ్ల పొదల్లో వదిలిపెట్టి వెళ్లిపోయారు. శిశువు వంటిపై మట్టి, చీమలతో అనాథలా పడి ఉండడంతో వెంటనే

బిడ్డను చేతిలోకి తీసుకుని ప్రాధమిక చికిత్స జరిపి ఆఘమేఘాలపై ఆ పసికందును  తన జీపు లో రోలుగుంట పీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. స్థానికులు, అధికారులు వెంటనే స్పందించడంతో కోలుకొని ఐసీడీఎస్ సంరక్షణలో క్షేమంగా ఉంది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంతో ఉన్నట్టు సమాచారం. ఈ పసిబిడ్డ ఎవరికీ చెందినదో తెలుసుకునే

 ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. 

ఎసై స్పందించిన తీరుకు DNS మీడియా బృందం అందరూ అభినందనలు తెలియచేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam