DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వస్కూల్లో పార్వతీపురం ఐఏఎస్ అధికారి కుమారుడు

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 03, 2021 (డిఎన్ఎస్):* ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు  సరిగ్గా చెప్పరు అనే చిన్న చూపు ఉన్న వారందరికీ అది తప్పు అని నిరూపించే దిశగా చర్యలు  చేపట్టారు విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ పిఓ రోణంకి కూర్మనాథ్. తన కుమారున్ని సీతానగరం మండలంలో గల జోగంపేటలో

ఉన్న బాలయోగి ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేర్పించి పీవో రోణంకి కూర్మనాథ్ ఆదర్శంగా నిలిచారు. ప్రాథమిక విద్య నుంచే తన కుమారుడు త్రివిక్రమ్ను చదివిస్తున్న ఆయన నేడు గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో ఎంపీసీ లో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య

పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి నాడు నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ సంస్థలకు దీటుగా విద్యను అందించడంలో ముందుకు రావడం జరిగిందని ఆయన అన్నారు. 
ఎటువంటి అపోహలు నమ్మకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam