DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోకకళ్యాణార్ధం సామూహిక శ్రావణ మాస కుంకుమార్చన

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 04, 2021 (డిఎన్ఎస్):* సింహాచలం మారుతీ కళ్యాణమండపం ఆవరణలో శ్రావణమాసం సందర్భంగా సామూహిక కుంకుమార్చనలను ఘనంగా నిర్వహించారు .. లోక కల్యానార్థం  సింహాద్రిమఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారిని సేవించారు . పది ఆవృతలతో

కూడిన సామూహిక కుంకమపూజలు జరిపి ప్రార్ధించారు . పాల్గొన్న వారందరికి సింహాద్రినాధుడు , మహాలక్ష్మి అమ్మవార్ల చిత్రపటాలు , పూజకు అవసరమైన కుంకమను ఉచితంగా అందజేశారు . సింహాద్రిమఠం నిర్వాహకులు , శ్రీనృసింహదీక్ష ప్రచారకులు కసిరెడ్డి సురేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కుంకమపూజలను సింహాచలం దేవస్థానం పూర్వపు

ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు భక్తులతో చేయించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణ మాసంలో సామూహిక కుంకమపూజలు నిర్వహించడం పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు . అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు , జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి - వైజాగ్

జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నృసింహ దీక్ష ప్రచారకులు చేపట్టిన ఈ కుంకమపూజల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మ వారిని కీర్తించడం అభినందనీయమన్నారు . తద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తిభావం వెల్లివిరుస్తుందన్నారు . భవిష్యత్తులో కూడా సామూహిక ప్రతాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు . పలు

ఆలయాలకు చెందిన వేద పండితులు పాల్గొనగా మారుతీ కళ్యాణ మండపం యజమాని సుదీర్ తదితరులంతా ఏర్పాట్లు పర్యవేక్షించారు . భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు .

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam