DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వినాయక చవితి వేడుకలు వీధి మండపాల్లోనే జరిపి తీరుతాం

*హిందూ వ్యతిరేక నిర్ణయం ప్రభుత్వం తొలగించాల్సిందే* 

*ఏపీ బిజెవైఎం ప్రధాన కార్యదర్శి డా. బైరెడ్డి శబరీ డిమాండ్*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 04, 2021 (డిఎన్ఎస్):* వినాయక చవితి వీధుల్లో చలువ మండపాలు వేసి మరీ కోవిడ్ నిబంధనల మధ్య జరిపి తీరుతామని ఆంధ్ర ప్రదేశ్ భారతీయ

యువమోర్చ (బీజేవైఎం) ప్రధాన కార్యదర్శి డా. బైరెడ్డి శబరీ ప్రకటించారు. ఈనెల 10 వ తేదీన వినాయక చవితి వేడుకలను వీధుల్లో జరపరాదంటూ సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రిమండలి లో తీర్మానించారని మండిపడ్డారు. దీన్ని పూర్తివుగా వ్యతిరేకిస్తూ ఆమె ఒక వీడియో విడుదల చేసారు. దీనిలో ఆమె ఏపీ ప్రభుత్వం

తీరును పూర్తిగా ఎండగట్టారు. హిందూ సంప్రదాయ విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటోందని, దీన్ని కచ్చితంగా విరమించుకోవాల్సిందేనని డిమాండ్ చేసారు. 
ఈ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం హిందూ సంప్రదాయానికి వ్యతిరేకంగానే ఉన్నాయన్నారు. ఈ సందర్భాన ఆమె కొన్ని ప్రశ్నలు సంధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిని, అధికారులను జవాబు

చెప్పాల్సిందిగా డిమాండ్ చేసారు. 

1 . కేవలం హిందూ పర్వదినోత్సవాలు, వేడుకల లోనే కొరోనా అంటుకుంటుందా? 

2 . రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు కు చైర్మన్ల పదవి ప్రమాణ స్వీకారాల్లో లక్షలాదిగా జనం ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటించకుండా తుంగలోకి తొక్కినప్పుడు కొరోనా ఉంది అని అప్పుడు వీళ్ళకి

గుర్తుకు రాలేదా?

3 . దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ని ఒక ఉత్సవంలా చేసుకుని, అందులో లక్షలాది గా జనం పాల్గొంటే. .  మాస్క్ లు కూడా లేకుండా వేడుకల్లో చేసుకున్నారు. అప్పుడు కొరోనా ఉంది అని అప్పుడు వీళ్ళకి గుర్తుకు రాలేదా?

4 .  నేతలు, మంత్రుల జన్మదిన వేడుకల్లోనూ, పార్టీ వేడుకల్లో ఒక్కరు కూడా

నిబంధనలు పాటించడకుండా లక్షలాదిగా జనం పాల్గొన్నప్పుడు కోవిడ్ ఉందని వీళ్ళకి గుర్తుకు రాలేదు. 

4 . విద్యా సంస్థలు తెరిచారు, సినిమా లు తెరిచారు, రాజకీయ పార్టీ మీటింగ్ ల్లో వేలాదిగా జనం పాల్గొంటే కొరోనా ఉంది అని అప్పుడు వీళ్ళకి గుర్తుకు రాలేదా?

 కేవలం హిందూ పండగలకు మాత్రమే కొరోనా ఉంది అని వీళ్ళకి

గుర్తుకు వస్తుందన్నారు. 

ఇతర మతాల వేడుకల్లో ఎటువంటి నిబంధనలు అమలు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యని ఈ ప్రభుత్వం తక్షణం వినాయక చవితి పై ఆంక్షలను విరమించుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో ప్రతి వీధిలోనూ వినాయక విగ్రహాలు పెట్టి, కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే నవరాత్రి ఉత్సవాలు

జరుపుతామన్నారు. 

మీరు ఈ రాష్ట్రంలోని అన్ని సామజిక వర్గాలు, కులాలు, మతాల వారూ ఓట్లు వేస్తెనే నేడు ఆ అధికార పీఠంలో కూర్చున్నారు అనే విషయం మరిచిపోయినట్టు ఉన్నారన్నారు. 

ఎవరీ శబరీ . . . 

ఆంధ్ర ప్రదేశ్ భారతీయ యువమోర్చ (బీజేవైఎం) ప్రధాన కార్యదర్శి డా. బైరెడ్డి శబరీ ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ఫైర్

బ్రాండ్ లాంటి వారు. గత ఏడాది కర్నూల్ లో తుంగభద్రా పుష్కరాల సందర్బంగా భక్తులు ఎవ్వరూ నదిలో స్నానాలు చేయరాదంటూ నిషేధం విధించిన ప్రభుత్వ రూల్స్ ను వ్యతిరేకిస్తూ. .. ప్రత్యక్ష పోరాటానికి దిగారు.

ఈమె తుంగభద్రా లో  నదీ  స్నానం చెయ్యడమే కాకుండా, మరొక పదిమందిని తీసుకు వెళ్లి మరీ నదీ స్నానం  చేయించారు. దాంతో

పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంతకు ముందు మూడు రోజుల పాటు ఈమెను గృహ నిర్బంధం, కూడా చేశారు.  

ఈమె చేసిన పోరాటం వల్లే షరతులతో కూడిన అనుమతిని తుంగభద్రా పుష్కరాల్లో ఇచ్చారు. 

ఈమె ప్రత్యేక రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (ప్రస్తుతం వీరు  బీజేపీ లో కొనసాగుతున్నారు) కుమార్తె

 అమ్మాయి. అదే డేరింగ్. ఈమె ఒక డాక్టర్. పేదలకు పూర్తిగా ఉచితంగా వైద్యం చేస్తున్నారు. 

వైద్య రంగంలో చేసిన విశేష సేవలకు గాను "డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ మెడికల్ ఎక్స్లెన్స్"  అవార్డు కూడా అందుకున్నారు డా. శబరీ.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam