DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ సచివాలయం పై కాషాయ జండా ఎగురవేద్దాం 

*హిందూ వ్యతిరేక పాలనపై హిందు ఐక్య పోరాట వేదిక పిలుపు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 07, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం (సెక్రటేరియట్ ) పై వినాయకచవితి ( ఈనెల 10 న) రోజే కాషాయ జండా ఎగుర వేద్దామని హిందు ఐక్య పోరాట వేదిక

పిలుపు ఇచ్చింది. కోట్లాది మంది హిందువులు దేశ విదేశాల్లో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే వేడుకలైన వినాయక చవితి నవరాత్రులపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని తప్పుపడుతూ మంగళవారం గుంటూరు లోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ హిందూ ఐక్య పోరాట వేదిక

కార్యాధ్యక్షులు చిరుమామిళ్ల గోపికృష్ణ, స్వామి నిత్యానందగిరి లు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రులపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని హిందు ఐక్య పోరాట వేదిక మండిపడింది. 
హిందువుల మనోబలం, ఐక్యత, ధైర్యం, తెగువ ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని చూపించాలంటే. . రాష్ట్ర పరిపాలనా కేంద్రం పై కాషాయ జండా ఎగరాలి

అని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొనాలని ఆహ్వానించారు. 

ఈ విలేకరుల సమావేశంలో రమణమూర్తి, లక్ష్మి రామానుజదాసి, వనమా నరేంద్ర, అనిల్ బెహరా, గిరిప్రసాద్, అనంత పద్మనాభం, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

త్వరలోనే  హిందూ ప్రజా ఉద్యమాన్ని గ్రామా స్థాయి నుంచి

చేపడతామని, గ్రామా, మండల, జిల్లా కేంద్రాల్లోని ప్రతి హిందూ బంధువుల్లో  ఐక్యతకై అవగాహనా కార్యక్రమాన్ని చేపడతామన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam