DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రిలో వైభవంగా స్వర్ణిం విజయ్ వర్ష్ వేడుకలు 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 07, 2021 (డిఎన్ఎస్):*   1971 పాకిస్తాన్ సాయుధ దళాలపై జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిన విజయం 50 వ వార్షికోత్సవాలను పూర్తి చేసుకున్న సందర్బంగా స్వర్ణీమ్ విజయ్ వర్ష్ వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శౌర్యం, దేశభక్తిపై యువ మనస్సులను

ప్రేరేపించడానికి, విజయ కాగడా దేశ వ్యాప్తంగా పర్యటిస్తోంది. మంగళవారం తూర్పు నౌకాదళం నుండి సైనిక కాన్వాయ్‌లో ఈ కాగడా  తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి చేరుకుంది. మోటార్‌సైకిల్ ర్యాలీలో రాజమండ్రిలోని ప్రసాద్ సర్కిల్ ZSB ఆఫీసర్ మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ హోటల్ రివర్ బే వద్ద సన్మాన వేదిక వద్దకు తీసుకెళ్లారు.

కెప్టెన్ VSC రావు, ENC సమక్షంలో 1971 యుద్ధంలోని గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు విక్టరీ ఫ్లేమ్ అందజేశారు. తరువాత, గ్యాలెంట్రీ అవార్డు విజేతలు, అనుభవజ్ఞులు మరియు వారి సమీప బంధువులు దేశానికి వారి అద్భుతమైన సేవకు సత్కరించారు.  వేడుక ముగిసిన తర్వాత విక్టరీ ఫ్లేమ్ ప్రజల సందర్శనార్థం ఉంచబడింది.

ఈ సందర్భంగా  జిల్లా

కలెక్టర్ హరికిరణ్, అర్బన్ జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ... భారత రక్షణ దళాల ధీరోదాత్త పోరాటాల ఫలితంగా 1971లో భారతదేశం పాకిస్థాన్‌పై విజయం సాధించిందని. స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ అభిషికేట్ కిశోరె,  అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) కె.

లతా మాధురి, సబ్ కలెక్టర్ అలేఖ్య,  ట్రాఫిక్ డివిజన్ డిఎస్పి కె.వి.యన్. వరప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam