DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శశికళకు షాక్‌, రూ.100కోట్ల విలువైన ఆస్తులు జప్తు?

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 09, 2021 (డిఎన్ఎస్):* వివాదాస్పద నేత, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కు ఆదాయపు పన్ను విభాగం అధికారులు గట్టి షాకిచ్చారు. అవినీతి కేసులో ఆమెకు చెందిన దాదాపు రూ. 100కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని

పయనూర్‌ గ్రామంలో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 

గతం లో ఈ ఆస్తులను ఒక సంగీత టీచర్ గంగై అమరన్ నుంచి ఈమె బలవంతంగా లాక్కున్నవి కావడం గమనార్హం. 

ఈ ఆస్తులను 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్న సమయంలో బలవంతంగా కొనుగోలు చేశారు. అప్పుడు వీటి విలువ దాదాపు రూ. 20 లక్షలు

కాగా.. ఇప్పుడు రూ.100కోట్ల వరకు ఉంటుందని అంచనా. 2014లో కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పులో ఈ 11 ఆస్తులను ‘‘ఆదాయానికి మించి ఆస్తులు’గా పేర్కొన్నారు. ఈ తీర్పు ఆధారంగానే ఐటీశాఖ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అవినీతి కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం

జైలులో శిక్ష అనుభవించి ఈ ఏడాది ఆరంభంలో విడుదలయ్యారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam