DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలనా చేతకాకుంటే. .తప్పుకోండి, జగన్ కు విష్ణు సూచన*

*అప్పుల్లో, మతమార్పిడిలోనూ నెం 1: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 09, 2021 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో పరి పాలన చేతకాకుంటే. .తప్పుకుని, మీ పార్టీలోనే సమర్థులైన వారికి పీఠాన్ని ఇవ్వాలని , ముఖ్యమంత్రి వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి కి బిజేపి రాష్ట్ర

ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నందుకు దిక్కుమాలిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ గానీ  ఏ మతం పై వివక్ష చూపినా బిజేపి సహించదని, ఇష్టం

వచ్చినట్లు నిర్ణయాలు చేస్తే బిజేపి ఊరుకోదన్నారు.

ఓట్లు గురించి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నారని, కరెంటు బుల్లులు పెంచమని డాబులు చెప్పారన్నారు. ట్రూ అప్ చార్జీల పేరుతో అదనపు భారం వేస్తున్నారని, పెట్రోలు ,డీజిల్ ధరల్లో పెరుగుదలకు కారణం జగన్ రెడ్డి‌‌ అన్నారు. 

దిక్కుమాలిన లిక్కర్లు

అమ్మి కూడా సొమ్ము చేసుకుంటున్నారని,  దేశంలో ఎక్కడాలేని అత్యధిక అప్పులు మన రాష్ట్రమే చేస్తోందన్నారు.  వివిధ కాంట్రాక్టు పనుల్లో తనకే 26 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు. రెండేళ్లు పూర్తి అయినా నేటికీ రూపాయి చెల్లించలేదన్నారు. 
ఆస్ధులు అమ్ముకొని బ్యాంకులకు అప్పులు చెల్లిస్తున్నానన్నారు. కాంట్రాక్టర్లకు బకాయి

చెల్లించకుండా ఏడిపించుకు తింటున్నారని, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వడంలేదన్నారు.  ఏపి ప్రభుత్వ పనులు చేపట్టే కాంంట్రాక్టర్లకు బ్యాంకులు అప్పులు ఇవ్వని దుస్ధితి ఉందన్నారు. రహదారుల దుస్ధితి మరిదారుణంగా వుందన్నారు. 

సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బిజేపి

అధికార ప్రతినిధి సుహాసినీ ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెళ్లిళ్లు, పార్టీ మీటింగ్ లు, నేతల  వర్ధంతులు , అధికార పార్టీ నేతల ప్రమాణ స్వీకారాలు ఇలా  అన్ని కార్యక్రమాలూ జరుగుతున్నాయని, వాటిల్లో వందల్లో, వేళల్లో ఎటువంటి కోవిద్ నిబంధనలూ పాటించకుండా అందరూ పాల్గొంటున్నా ప్రభుత్వానికి కనపడక పోవడం బాధాకరం అన్నారు.

కేవలం వినాయక చవితి వేడుకలకు మాత్రమే కోవిద్ నిబంధనలు పేరుతొ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం పై బీజేపీ తీవ్రంగా ఖండించిందన్నారు. 

వీధుల్లో వినజాయక చవితికి వేడుకలు జరిపేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో విలేకరుల సమావేశంలో వినాయక ప్రతిమ ను కూర్చోబెట్టడం విశేషం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam