DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాలయాలు మనకే పాదయాత్రకు జీయర్ల మంగళా శాసనం

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 10, 2021 (డిఎన్ఎస్):* ప్రభుత్వ పెత్తనాల్లో ఉన్నహిందూ దేవాలయాలకు విముక్తి లభించాలి అనే డిమాండ్లతో మన దేవాలయాలు మనకే ఉద్యమం నినాదంతో భాగ్యనగరం నుంచి తిరుమల వరకూ మహా పాదయాత్ర కు శ్రీవైష్ణవ సంప్రదాయ పీఠాధిపతులు మంగళాశాసనం చేసినట్టు నిర్వాహక కమిటీ ప్రతినిధి

 డా. పిటిజివి రంగాచార్యులు తెలియచేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి, శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, విజయవాడ త్రిదండి అష్టాక్షరీ సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి, హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ అనుగ్రహాన్ని

అందించారు.   

ఈ నెల  సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 3 వరకు సాగే ఈ యాత్రలో వరకు మహా ఉద్యమం నిర్వహించేందుకు హిందూ సమాజం, హిందుత్వ రక్షణ సంఘాలు సిద్ధమవుతున్నాయి. 

శంషాబాద్ శ్రీరామ్ నగర్ లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనం అందించినట్టు

తెలుస్తోంది. ఈ పాదయాత్ర ఉద్యమ కన్వీనర్ శ్రీనివాస్ శుక్రవారం ఆశ్రమం లో స్వామీజీని కల్సి యాత్ర వివరాలు తెలియచేయడం జరిగింది. ఈ యాత్ర సంకల్పం పూర్తిగా నెరవేరాలని మంగళాశాసనం అందించినట్టు తెలిపారు. 

శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ఈ పాద యాత్ర కు తమ మంగళాశాసనం ని

అనుగ్రహించారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో చాతుర్మాస్య దీక్షలో వేంచేసి ఉన్నారు. ఈ సందర్బంగా స్వామి మాట్లాడుతూ  హిందువుల అందర్నీ ఏకం చేసి మన దేవాలయాలు మనకే అనే ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లి విజయం సాధించాలని మంగళాశాసనం గావించారు 

విజయవాడ త్రిదండి అష్టాక్షరీ సంపత్ కుమార్ రామానుజ

జీయర్ స్వామి వారు తమ మంగళాశాసనం అందిస్తూ ఈ ఉద్యమం మన  తెలుగురాష్ట్రాలకేకాక యావత్ భారతావనికి మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ రద్దు గురించి దేవాలయాల విముక్తి గురించి  ఆరంభిస్తున్న మహా పాదయాత్ర ఉద్యమానికి మహాత్ములు తమ ఆశీర్వచనాలను

అందిస్తున్నారు 

శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం పీఠాధిపతులు  జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామీజీ మహా పాదయాత్ర కార్యక్రమానికి ఆశీర్వచనాలు అందించారు.

ఇప్పడికే ఎందరో పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు ఈ ఉద్యమానికి సంపూర్ణ maddatu ప్రకటించినట్టు నిర్వాహకులు

తెలియచేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam