DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోర్టు అనుమతి ఉన్నా గణేష్ పెండాల్స్ పీకేశారు: బీజేపీ 

*పాలకుల అతి పై భగ్గుమన్న హిందూ ఐక్యతా శక్తి* 

*అధికార దర్పానికి బ్రేక్ వేసిన బీజేపీ మహిళా నేత మాధవి*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 10, 2021 (డిఎన్ఎస్):* హై కోర్టు ఇచ్చిన నిబంధనలకు లోబడి వినాయక చవితి వేడుకలు జరిపేందుకు నగరంలో వేసుకున్న పందిళ్లను  పోలీసులు అతి

ఉత్సాహంతో కూల్చేసిన చోటే హిందూ భక్తులు ఐక్యతతో శక్తి గా ఏర్పడి వేడుకలను జరుపుకున్నట్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ సభ్యుడు విజయశంకర్ ఫణింద్ర తెలిపారు. శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానందతో కలిసి నగర పరిధిలోని వినాయక చవితి వేడుకల మండపాలను సందర్శించారు. ఈ సందర్బంగా అయన

మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కోవిద్ నిబంధనలు కేవలం  హిందూ పండగల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తాయన్నారు. అధికార పార్టీ నేతలు సభలు, సమావేశాలు, జయంతి, వర్ధంతి లకు వేళల్లోనూ, లక్షల్లోనూ జన సమీకరణ చేస్తూ, ఒక్కడు కూడా ముఖానికి మాస్క్ లేకుండా, భౌతిక దూరం కూడా పాల్గొంటున్న. . పోలీసులు కళ్ళు మూసుకు పోయారన్నారు.

గురువారం విశాఖ నగరంలోని చాల మండపాలను కూల్చేశారని, అదే అధికార పార్టీ మహిళా కమిషన్ వాసిరెడ్డి జన్మ దిన వేడుకలను బహిరంగంగా రోడ్డు పై, విశాఖలో జగనన్న మహిళా సైన్యం ఓ 50 మంది మహిళలతో ముఖానికి ఒకరికి కూడా మాస్క్ లేకుండా, భౌతిక దూరం అనే సెన్స్ కూడా లేకుండా వేడుకలు జరిగిప్తే ఈ పోలీసులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

 

అధికార పార్టీ కార్యకలాపాలకు లేని కోవిడ్  నియమ నిబంధనలు కేవలం హిందువుల పండగ మాత్రమే కోవిడ్ నియమాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని ఏరియాల్లో పందిర్లు వేసి ఎటువంటి యువతను బెదిరించడం జరిగిందన్నారు.  
ప్రధానంగా కంచరపాలెం ధర్మా నగర్, జోడుగుళ్ల పాలెం, గోపాలపట్నం,పెందుర్తి, పెద్ద జాలరి పేట

లుంబిని పార్క్ ఏరియా, గోపాలపట్నం, చిలక పేట, లక్ష్మీ టాకీస్, కొత్త రోడ్,  కంచరపాలెం, రైల్వే న్యూ కాలనీ వారి దగ్గర్నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ద్వారా వారితో మాట్లాడి ధైర్యం చెప్పి న్యాయపోరాటానికి ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుందని చెప్పామన్నారు.  

నగర పరిధిలోని గోపాలపట్నం లోని ఇందిరా నగర్

కోలనీ లో కొందరు యువకులు ఏర్పాటు చేసుకున్న వినాయక చవితి మండపాన్ని అధికారులు గురువారం అర్ధ రాత్రి నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు ప్రయత్నం చేసారు. మండపం వద్ద వేసుకున్న అలంకరణ సామాగ్రిని కూల్చేశారు. ఈ విషయం తెల్సిన బీజేపీ మహిళా నేత మాధవి ఆ ప్రాంతానికి చేరుకొని అధికారుల ఓవర్ ఆక్షన్ కు బ్రేక్ వేశారు. ప్రైవేట్ స్థలంలో

పెట్టుకున్న మండపం ను ఎలా తొలగిస్తారంటూ మండిపడ్డారు. అక్కడే పబ్లిక్ ప్లేస్ లో ఇటీవలే మొదలు పెట్టిన మద్యం దుకాణాన్ని తక్షణం తొలగించి అప్పుడు మాట్లాడాలని నిలదీశారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam