DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రోడ్ల కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకునే ధైర్యం లేదా? 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 11, 2021 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో రహదారుల దుస్థితి కి కారణం ఎవరు..నాణ్యతా లోపంతో నిర్మించిన కాంట్రాక్టర్లు పై చర్యలు తీసుకోవడంలో అధికార పార్టీ ఎందుకు వెనకడగు వేస్తుందో తెలపాలని దీనిపై తమతో పాటు రాష్ట్ర ప్రజలందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం

అన్నారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితి కి సంబంధించి శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్ల పంచాయితీ నడుస్తుందని రోడ్ల దుస్థితిని ఒక రాజకీయ ఎజెండాగా తీసుకుంటున్నారే తప్ప ప్రజా క్షేమం కోసం ఎవరూ పట్టించుకోవట్లేదని అన్నారు. వంద రూపాయల మొదలుకొని వేల రూపాయల తో కొనుగోలు చేసే వస్తువుల విషయంలో

ఎన్నిరోజుల మన్నిక వస్తుందో చూసుకొని మరి కొనుగోలు చేస్తామని ఒకవేళ మన్నిక కోసం ఇచ్చిన కాలం కంటే తక్కువ సమయంలో వస్తువు పాడైపోయిన, పనిచేయకపోయిన కొత్త వస్తువు ఇస్తారని అలాంటిది కొన్ని కోట్ల రూపాయల నిధులను ఖర్చు పెట్టి వేసే రోడ్ల కు మన్నిక కాలం ఉండదా అని ప్రశించారు. భారీ వాహనాలు వెళ్లే రహదారుల మన్నిక కనీసం 10 ఏళ్ళు ఐన

ఉంటుందని ఈలోపు ఆ రహదారుల మధ్య గోతులు పడినా, దెబ్బ తిన్నా రోడ్లు వేసిన కాంట్రాక్టర్లే బాధ్యత వహించి మరామ్మత్తులు చేయాల్సి ఉంటుంది కదా అని ప్రశ్నించారు. వాస్తవానికి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరం అవుతుందని వీరు వేసిన రోడ్లు ఎక్కడ లేవని,గత టీడీపీ హయాంలో వేసిన రోడ్లు అని నాసిరకంగా వెయ్యడం

వలనే ఈ పరిస్థితి దాపురించిందని అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని ఒకవేళ అదే వాస్తవం ఐతే అధికారం లో ఉన్న మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లో వెనకడుగు వేస్తున్నారో ప్రజలకు తెలపాలన్నారు. గత ప్రభుత్వం చేసిన ప్రతి పనుల పై  సీఐడీ చేత కేసులు పెట్టిస్తున్న ప్రభుత్వం రహదారుల  విషయంలో ఎందుకు మౌనంగా ఉండిపోయారో

తెలపాలని డిమాండ్ చేశారు. రోడ్ల కాంట్రాక్టుల్లో మీరు ప్రతిపక్షంలో ఉండగా కమిషన్ లు ఏమన్నా అందాయా లేక మీవాళ్ళకి చెందిన బినామిలు ఎవరన్నా ఉన్నారా అని నిలదీశారు. రోడ్ల దుస్థితి కి కారణమైన వారి పై విచారణ జరిపి ప్రజల ముందు వారిని దోషులుగా నిలబడితే మీకే కదా మంచి పేరు వస్తుందని అన్నారు.ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేని

పక్షంలో రహదారుల దుస్థితికి కారణమైన వారిపై నాణ్యతలోపం గా వేసిన రోడ్ల కు భద్రతా, నాణ్యత ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన అధికారుల పై విచారణ జరిపించాలని హైకోర్టు లో జై అనకాపల్లి సేన తరపున ప్రజాప్రయోజన వాజ్యం వేస్తామని కొణతాల సీతారాం స్పష్టం చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam