DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నగరవనంలో అటవీ అమరవీరులకు ఘన నివాళి 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 11, 2021 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని  దివాన్ చెరువు గ్రామ పరిధిలోని గోదావరి మహా పుష్కర నగరవనం ప్రాంగణంలో గల అటవీ అమరవీరుల స్మారక స్థూపం వద్ద శనివారం ఉదయం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి సర్కిల్

ముఖ్య అటవీ సంరక్షణాధికారి (సిసిఎఫ్) ఎన్ నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై అటవీ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అటవీ శాఖ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. అమరవీరుల కీర్తిని, స్ఫూర్తిని శాశ్వతంగా నిలపడం కోసం నగరవనంలో వారికి స్మారక స్థూపాన్ని నిర్మించడం జరిగిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1939  నుంచి 2021 వరకూ  మొత్తం 22 మంది అటవీ సిబ్బంది అటవీరక్షణ విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి కుటుంబాలకు అటవీ శాఖ తగిన పరిహారం ఇవ్వడమే కాకుండా వారసులకు ఉద్యోగం కూడా ఇచ్చి ఆదుకుందన్నారు. 
రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణం 162968 చదరపు కిలోమీటర్లు కాగా , ఇందులో 37258  చదరపు

కిలోమీటర్లలో అడవులు వ్యాపించి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మొత్తమ్మీద 23 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడడం కోసం అటవీశాఖ ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారని సిసిఎఫ్ చెప్పారు. ఆయుధాలు లేకుండా, కుటుంబాలకు, పౌర సదుపాయాలకు దూరంగా ఉంటూ నేరగాళ్ళను, క్రూరమృగాల భయాన్ని ఎదుర్కొని అటవీ రక్షణ విధులు నిర్వహించడం ఎంతో

క్లిష్టమన్నారు. అయితే ఇన్ని కష్టాల్లో కూడా మొక్కవోని అంకితభావంతో, తెగింపుతో అటవీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. రాజమండ్రి సర్కిల్ పరిధిలో అటవీ సిబ్బంది విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. కార్యక్రమానికి స్క్వాడ్ డి ఎఫ్ ఓ ఎం వి ప్రసాదరావు అధ్యక్షత

వహించారు. ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 11 ని జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినంగా,  నవంబర్ 10  న రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామని చెబుతూ ఆయా దినాల ప్రత్యేకతను, నేపథ్యాన్ని వివరించారు.  అటవీ అమరవీరులకు అధికారులతో పటు, క్షేత్రస్థాయి సిబ్బంది జోహార్లు అర్పించారు. ఫారెస్ట్ అకాడమీ డిప్యూటీ

డైరెక్టర్లు వి శ్రీహరి గోపాల్, డి ఫణికుమార్ నాయుడు, స్టేట్ సిల్వికల్చరిస్ట్ భీమయ్య, అసిస్టెంట్ సిల్వికల్చరిస్ట్ ఎన్ శివరామప్రసాద్, సిఎఫ్ కార్యాలయ సూపరింటెండెంట్ పి శైలజ, నగరవనం ఎఫ్ ఆర్ ఓ ధనరాజు, సుజాత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam