DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల క్షేత్రానికి అంతర్జాతీయ ఐఎస్ఓ గుర్తింపు

*ఈఓ సూర్యకళ మొదటి రోజు చెప్పినట్టే సాధించారు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 11, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ) 9001:2015 సర్టిఫికెట్ లభించింది. ఆలయానికి చెందిన

అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని HYM international Certifications సంస్థ ఈ గుర్తింపునిచ్చింది. ఈ సంస్థ ప్రతినిధుల నుంచి అధికారిక పాత్రలను శనివారం ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ అందుకున్నారు. 
 భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగుల నాణ్యమైన సేవలు, పరిశుభ్రత, పచ్చదనంలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా

ఉన్న భక్తులకు నాణ్యమైన సేవలందిచడంతోపాటు... హిందూ ధర్మాన్ని , సంస్కృతిని సింహాచలం దేవస్థానం ప్రమోట్ చేస్తోందని సర్టిఫికెట్ లో పేర్కొన్నారు. 
         ఈ సందర్భంగా ఈఓ సూర్యకళ మాట్లాడుతూ..." మంత్రిగారి చేతులమీదుగా ఈ అవార్డును స్వీకరించడం చాలా శుభ పరిమాణం. ఇది శుభ దినం. ముఖ్యంగా గత ఆర్నెళ్ల నుంచి దేవస్థానంలో

ఉద్యోగుల నాణ్యమైన సేవల గురించి ఆడిటర్ ద్వారా అంతర్జాతీయ సంస్థకు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చాం. అంతర్జాతీయ ప్రమాణాలను మేం అందుకున్నాం. ఫుడ్ అండ్ సేఫ్టీ ఆడిటింగ్ ప్రస్తుతం దేవస్థానంలో జరుగుతోంది. ఆ రంగంల్లోనూ ఐఎస్ఓ సర్టిఫికెట్ వస్తుందనిఆశిస్తున్నామన్నారు. 

మొదటి రోజు చెప్పినట్టే సాధించారు : .

. . .సింహాచల దేవస్థానం ఈఓ గా సూర్యకళ భాద్యతలు చేపట్టిన తదుపరి నిర్వహించిన విలేఖరుల  సమావేశంలో సుస్పష్టమైన ప్రకటన చేసారు. తన హయాంలో ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆమె మొదటి రోజు చెప్పినట్టే సింహాచల దేవాలయానికి ఐ ఎస్ ఓ గుర్తింపు తీసుకు వచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam