DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విగ్రహాలన్నీ ప్రగతి భవన్ ముందు పెట్టండి :రాజాసింగ్  

ట్యాంక్ బండ్ లో నిమ‌ర్జ‌నానికి పోలీసుల అనుమ‌తి లేదు   

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం / భాగ్యనగరం, సెప్టెంబర్ 11, 2021 (డిఎన్ఎస్):* తెలంగాణలోని భాగ్యనగరంలో వినాయక మండపాల్లో పెట్టిన వినాయక విగ్రహాల నిమజ్జనం ఎక్కడ చెయ్యాలో చెప్పకపోతే విగ్రహాలను ప్రగతి భవన్ ముందు పెట్టాలని గోషామహల్

ఎమ్మెల్యే  రాజాసింగ్ పిలుపు నిచ్చారు. ప్రతి ఏడాది నిమజ్జనం చేసే ట్యాంక్ బ్యాండ్ నీటిలో విగ్రహ  నిమజ్జనానికి అనుమతి నిషేదించడం తో అయన ఈ వ్యాఖ్యలు చేసారు.  న‌గ‌రంలోని అన్ని మండ‌పాల‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను బహిరంగంగా నిర్వహించుకోడం పై

ప్రభుత్వాలు పూర్తి గా నిషేధం విధించిన నేపద్యంలో భక్తులు కోర్టు ను ఆశ్రయించారు. ప్రస్తుతం వినాయక చవితి వేడుకల అనంతరం విగ్రహాలను నిమజనాన్న్ని కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే నిమజ్జనాన్నీ కూడా అడ్డుకుంటున్నారన్నారు. ఒక్క భాగ్యనగరం లోనే వేలాదిగా విగ్రహాలు ఉంటాయని, వాటిని ఎక్కడ పెట్టాలో

చెప్పక పొతే ఏమి చేయాలన్నారు. నిబంధనలు పెట్టె ముందు వాటికి  పరిష్కారం కూడా చూపాలన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam