DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాయ శాఖా రద్దు కై ఉద్యమం లో తొలి అడుగు పాదయాత్ర  

*మన దేవాలయాలు మనకే మహా పాదయాత్ర ప్రారంభం*

*పాదయాత్రకు పలు వైష్ణవ, శైవ  పీఠాధిపతుల అనుగ్రహం*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*భాగ్యనగరం/ విశాఖపట్నం, సెప్టెంబర్ 13, 2021 (డిఎన్ఎస్):* దేవాదాయ శాఖా రద్దు కోసం మొదలైన మహా ఉద్యమం లో తొలి అడుగు పడింది. భాగ్యనగరం నుంచి తిరుపతి కోసం మహా పాదయాత్ర

ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7 గంటలకు మన దేవాలయాలు మనకే మహా పాదయాత్ర భాగ్యనగరం లోని కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం వద్ద ప్రారంభం అయ్యింది. పాంచజన్య శంఖధ్వానం తో యాత్ర సాగింది. ఈ పాదయాత్రకు పలువురు పీఠాధిపతులు, హిందూ సంఘాలు, అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణా సంక్షేమ సంఘం తదితరులు సంఘీభావం  ప్రకటించారు. 



కార్యక్రమంలో రాష్ట్ర పతి పురస్కారం పొందిన ఒక ఉపాధ్యాయులు పిటీజీవి రంగాచార్యులు, తాళ్లూరి మఠాధిపతి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు, భగవద్రామానుజ సంక్షేమ సమితి అధ్యక్షుడు డీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు, యాత్రా కన్వీనర్ కాసాని శ్రీ నివాస గౌడ్, అఖిలభారత హిందూ మహా సభ ఉపాధ్యక్షులు కమలేష్ మాహరాజ్, 
తెలంగాణ

ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శంఖ వాదులను, వాహన చోదకులను, వీడి యో బృందం యాత్ర లో తొలి అడుగు వెయ్యగా, భారీ సంఖ్యలో హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

మహా పాదయాత్ర కు శ్రీవైష్ణవ సంప్రదాయ పీఠాధిపతులు మంగళాశాసనం చేసినట్టు నిర్వాహక కమిటీ ప్రతినిధి  డా. పిటిజివి రంగాచార్యులు తెలియచేస్తున్నారు. ప్రముఖ

ఆధ్యాత్మిక వేత్త చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి, tridanti అహోబిల జీయర్ స్వామి,  శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, విజయవాడ త్రిదండి అష్టాక్షరీ సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి, హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ అనుగ్రహాన్ని అందించారు.   

ఈ నెల

 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 3 వరకు సాగే ఈ యాత్రలో వరకు మహా ఉద్యమం నిర్వహించేందుకు హిందూ సమాజం, హిందుత్వ రక్షణ సంఘాలు సిద్ధమవుతున్నాయి. 

శంషాబాద్ శ్రీరామ్ నగర్ లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి, శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు త్రిదండి రామచంద్ర రామానుజ

జీయర్ స్వామి, విశాఖ sri sarada పీఠాధిపతులు swarupanandendra saraswati, 
విజయవాడ త్రిదండి అష్టాక్షరీ సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి, శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం పీఠాధిపతులు  జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామీజీ, 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ రద్దు గురించి దేవాలయాల విముక్తి గురించి

 ఆరంభిస్తున్న మహా పాదయాత్ర ఉద్యమానికి మహాత్ములు తమ ఆశీర్వచనాలను అందిస్తున్నారు 

మహా పాదయాత్ర కార్యక్రమానికి ఆశీర్వచనాలు అందించారు.

ఇప్పడికే ఎందరో పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు ఈ ఉద్యమానికి సంపూర్ణ maddatu ప్రకటించినట్టు నిర్వాహకులు తెలియచేస్తున్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam