DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వేజోన్ డిపిఆర్ వెళ్ళింది, బోర్డు మీట్ లో తేలుతుంది

*అరకు తో కూడిన జోన్. . విశాఖ రైల్వే జోన్ పై ఎంపీ జివిఎల్*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 15, 2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం ప్రధాన కేంద్రం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు పై డిపిఆర్ ( పూర్తి ప్రణాళిక నివేదిక) రైల్వే బోర్డు, కేంద్రానికి పంపడం జరిగిందని,

త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహారావు తెలిపారు. బుధవారం విశాఖపట్నం లోని నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి కేంద్రానికి పంపిన డిపిఆర్ పై త్వరలోనే జరుగనున్న రైల్వే బోర్డు సమావేశంలో దీనిపై ఆమోద నిర్ణయం తీసుకుంటారని, అవసరమైతే చిన్న

మార్పులు కూడా ఉంటాయన్నారు. దీని స్థితిగతులపై గతవారం తమ బీజేపీ బృందం రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మను కలిసి వినతి పత్రం అందించామన్నారు.  తమకు అందిన సమాచారం ప్రకారం అరకు ప్రాంతం వరకూ విశాఖ డివిజన్ లోనే ఉంటుందని, గుంటూరు, గుంతకల్, విజయవాడ జోన్లను కలుపుతూ ఈ కొత్త రైల్వే జోన్ వస్తుందన్నారు. యదార్ధ పరిస్థితి రైల్వే

బోర్డు సమావేశం తర్వాతే తెలుస్తుందన్నారు. 
ఈ అంశంపై విశాఖ లోని ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ను కలిసి కొత్త జోను సత్వర ఏర్పాటుకు తీసుకోవలసిన చర్యల గురించి సమీక్ష నిర్వహించామన్నారు. 

రాష్ట్రంలో రైల్వే రంగం కేంద్రం  అభివృద్ధి చేస్తోందనన్నారు. నడికుడి శ్రీ కాళహస్తి  లైన్ కేంద్రం అభివృద్ధి చేసింది.

దాదాపు 10 ప్రాజెక్టులు ..ఈ రాష్ట్ర వాటా ఇవ్వని కారణంగా నిలిచి పోయాయన్నారు. 

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని తదితరులు పాల్గొన్నారు . 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam