DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*వైకాపా తో బీజేపీ వైఖరి రాష్ట్రంలో ఇలా. కేంద్రంలో అలా*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 15, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తో భారతీయ జనతా పార్టీ ద్వంద వైఖరి చూపుతోంది అనే అంశాలు బహిర్గతమవుతోంది. రాష్ట్రంలో పాలనా పై రాష్ట్ర బీజేపీ నేతలు, రాజ్యసభ సభ్యులు పూర్తిగా వ్యతిరేకిస్తూ. .. పూర్తిగా

మండిపడుతున్నారు. ఇదే విషయాన్నీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి సైతం జగన్ పార్టీ పాలనపై పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. 

అయితే కేంద్ర మంత్రులు, ఢిల్లీ పెద్దలు వైకాపా నేతలు, ముఖ్యంగా విజయ సాయి రెడ్డి తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి నిదర్శనంగానే

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు లో సభ్యులుగా తామ సన్నిహితులకు ఇవ్వాలంటూ నాలుగు సిఫారసు ప్రతిపాదనలు కూడా వచ్చాయంటూ పార్టీ వర్గాల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

ఇంతవరకూ వైఎస్ జగన్ పాలనకు రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రమే విమర్శిస్తున్నారు తప్ప, కేంద్రం లోని పెద్దలు ఇంతవరకూ విమర్శించినా

దాఖలాలు లేకపోవడమే నిదర్శనం. 

ఈ విషయంపై ఎంపీ జివిఎల్ నర్సింహారావు స్పందిస్తూ కేంద్రం - రాష్ట్రం మధ్య బంధాలు అనుబంధాలతో తమకు సంబంధం లేదని, అయినా ఆ విషయం తమ దృష్టికి రాలేదని, తాము మాత్రం వైఎస్ జగన్ పాలనపై వ్యతిరేకంగానే ఉన్నట్టు ప్రకటించారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam