DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మా దీక్షలు సొంత ధనంతో చేస్తే . . కొంగ దీక్షలు ప్రజాధనంతో చేస్తారు

కోట్లాది ప్రజాధనం తో చంద్ర బాబు సొంత డబ్బానా ? : వైఎస్సార్ కాంగ్రెస్ 

విశాఖపట్నం, జులై  31 , 2018 (DNS Online ): కోట్లాది రూపాయల ప్రజా దానం వృధా చేసి సొంత డబ్బా

కొట్టుకుంటున్న చంద్రబాబు కు గట్టిగా బుద్ది చెప్పాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. మంగళవారం నగరం లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో నగర అధ్యక్షులు మళ్ల విజయ ప్రసాద్ మాట్లాడుతూ సొంత నిధులతో తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, నిరసనలు, ధర్నాలు,

చేస్తుంటే. . . ఈ రాష్ట్రాన్ని దోచుకుతింటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి దొంగ దీక్షలు చేయడం పై ప్రజలు రానున్న కాలం గా

తెలుగుదేశం పార్టీ కి గట్టిగా బుద్ది చెప్తారన్నారు. వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర కు ప్రజల నుంచి లభిస్తున్న ప్రజాభిమానాన్ని చూసి తట్టుకోలేక

తెలుగుదేశం పార్టీ, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్రలు కుత్రంత్రాలు చేస్తోందన్నారు. పైగా ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా

నెరవేర్చలేదన్నారు. కాపు కార్పొరేషన్ కు ఏటా వెయ్యి కోట్లు నిధులు ఇస్తామని చెప్పి à°—à°¤ నాలుగేళ్ల లో కేవలం 1200  à°•à±‹à°Ÿà±à°² రూపాయలు మాత్రమే విడుదల చేసి, ఇప్పుడు కులాల

మధ్య చిచ్చు పెడుతున్నదన్నారు. కాపు సామాజిక వర్గానికి బిసి లుగా రిజర్వేషన్లు ఇస్తామని గత ఎన్నికల్లో ప్రకటించి, ఇప్పుడు కేంద్రం ఒప్పుకోవడం లేదంటూ

నాటకాలాడుతున్నారన్నారు. ఇదే అంశంపై రెండు రోజుల క్రితం జగ్గంపేటలో ప్రజా సంకల్ప యాత్ర సందర్బంగా  à°µà±ˆ ఎస్ జగన్ మాట్లాడుతూ కేంద్రం పరిధి లోను, సుప్రీకొర్టు

పరిధి లోను ఉన్న అంశాలపై తాను చంద్రబాబు నాయుడు తరహాలో లేనిపోని హామీలు, అంత తొందరగా సాధ్యం కానీ హామీలను ఇవ్వలేనని, అయితే తాము ఈ రిజర్వేషన్ కు వ్యతిరేకం

కాదన్నారని తెలిపారు. తాము అధికారం లోకి వస్తే ఈ సామాజిక వర్గానికి ఏడాదికి రెండు వేలకోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రకటించగా, ఇది రుచించని

తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, ఆగని భజన బృందాలు జగన్ మోహన్ రెడ్డి పై అవాకులూ చెవాకులూ పేలుతున్నారని మండిపడ్డారు. 

ఈ విలేకరుల సమావేశం లో విశాఖపట్నం

పార్లమెంట్ ఇంచార్జి à°Žà°‚ వి వి సత్యనారాయణ, నగర మహిళా అధ్యక్షురాలు గారికిన గౌరీ, ఎస్సి విభాగం అధ్యక్షులు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

 

#dns media #dns #dns news #dnsnews #dnslive #dns live #news agency

#vizag #visakhapatnam #visakha #YSR Congress #YSR Congress #YSRCP #Congress #Protest #Telugu desam #TDP #Telugu desam party #political #Kapu reservation #Kapu community #kapu #YS Jagan

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam