DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తాలిబన్ చెర నుంచి ఆఫ్ఘన్ ను కాపాడండి: ఎయు ఆఫ్ఘన్ విద్యార్థులు 

*పాక్ కు వ్యతిరేకంగా ఎయు లో విద్యార్థుల శాంతియుత నిరసనలు. .*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 16, 2021 (డిఎన్ఎస్):* తాలిబన్ ల చెర నుంచి ఆఫ్గనిస్తాన్ ను కాపాడి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ విశాఖ లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లోని ఆఫ్ఘన్ విద్యార్థులు శాంతియుత నిరసనలు చేశారు.

గురువారం ఏ యు  ప్రధాన ద్వారం వద్ద నిర్వహించిన శాంతియుత నిరసనల్లో విదేశీ విద్యార్థులతో పాటు స్థానిక విద్యార్థులు సైతం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా యువతి యువకులు సేవ్ ఆఫ్ఘన్, వుయ్ స్టాండ్ విత్ పంజ్ షేర్, మహిళల హక్కులు కాపాడాలంటూ, తక్షణం పాకిస్తాన్ తాలిబాన్లకు మద్దతు విరమించుకోవాలంటూ ప్లకార్డు

ప్రదర్శించారు. ఈ రాక్షస పాలనను ఐక్య రాజ్య సమితి గుర్తించరాదంటూ నినాదాలు చేసారు. ప్రపంచ దేశాల జోక్యం అవసరమన్నారు. 
ఈ సందర్బంగా ప్రదర్శించి పోస్టర్లు, బ్యానర్లలో ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో జరుగుతున్నా తాలిబన్ల అత్యంత పాశవిక, క్రూర చర్యలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్న దృశ్యాలను ప్రదర్శించారు. 
తాలిబన్ల పాశవిక

పాలనకు పూర్తి మద్దతు ప్రకటించి, పంజిషీర్ పై యుద్ధ విమానాలను నడిపి వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులను హతమార్చిన పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తక్షణం ఐక్యరాజ్య సమితి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని, తాలిబన్ల చెరనుంచి ఆఫ్గనిస్తాన్ ను కాపాడి, మానవ హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam