DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణా కార్పొరేషన్ లో వాట్స్ అప్ గ్రూప్ ల బాగోతం..?

*స్కీం లే లేని బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఈ హంగామా ఏంటి?* 

*గ్రూప్ లపై కార్పొరేషన్ నుంచి అధికారికంగా ప్రకటనే లేదు.* 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 16, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్, ఈ పేరు చెప్పగానే ఆంధ్ర ప్రదేశ్ లోని సాధారణ బ్రాహ్మణులకు

ఉత్సాహం వస్తుంది. ఇది రెండేళ్ల క్రితం నాటి మాట. నేడు ఈ కార్పొరేషన్ పేరు చెప్పగానే సగటు బ్రాహ్మణుడు మండిపడుతున్నాడు. దీనికి ప్రధాన కారణం కోట్లాది గా నిధులు కేటాయిస్తున్నట్టు గా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించినప్పడికీ, నేడు ఒక్క పధకం కూడా అమలు లో లేవు. ఈ విషయం అందరికి తెలిసిందే. విద్యార్థులకు ఇచ్చే భారతి,

 గాయత్రీ, స్కీం లు  అంత్యక్రియలకోసం ఇచ్చే గరుడ స్కీం, లాంటివి నేడు మచ్చుకైనా కనపటం లేదు. ఇక వృద్దులకు ఇచ్చే పింఛను కశ్యప స్కీం ను ప్రభుత్వ పధకానికి జోడించేసారు. దీంతో వాలంటీర్లే నేరుగా ఈ పింఛన్ ను, ప్రభుత్వ కొత్త నుంచి లబ్దిదారులకు ఇస్తున్నారు. ఇక మిగిలిన పాహకాలన్నీ హుళ్లక్కే అయ్యాయి. 

అయితే ఈ

క్రమంలోనే ఏ స్కీం అమలులోనే ఈ కార్పొరేషన్ ను చైర్మన్ గా సీతంరాజు సుధాకర్ ఒక కార్పొరేట్ వ్యక్తిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈయన కేవలం అధికార పార్టీ కి మాత్రమే పరిమితం కావడంతో ఈయన ఎవరో రాష్ట్రంలోని 85 శతం మందికి తెలియక పోవడం గమనార్హం.  అయితే పథకాలను అందుకోవాల్సిన లబ్దిదారులకు సమయానికి క్రమం

తప్పకుండా పధకాలు అమలు జరిగితే. . .చైర్మన్ ను కలవవలసిన అవసరమే ఉండదు. 

ఈక్రమంలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ పేరుతొ ఒక వ్యక్తి అన్ని ప్రాంతాల బ్రాహ్మణ ప్రముఖులకు ఫోన్ చేసి, తాము నియోజక వర్గాల వారీగా వాట్స్ అప్ గ్రూప్ లు తయారు చేస్తున్నామని సహకరించమని కోరుతున్నారు. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని

శాసన సభ నియోజక వర్గాల వారికీ ఫోన్ లు వెళ్తున్నాయి. పైగా ఈయన కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ వ్యక్తిగా, చైర్మన్ పేరు చెప్పి మరీ పరిచయం చేసుకుంటున్నారు. 

ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన వారు ఎవరు? 

ఫోన్ కాల్ అందుకున్న ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న ఒక్కటే. . అసలు స్కీం లే లేని కార్పొరేషన్ లో ఈ గ్రూప్ లు

ఎందుకు తయారు చేస్తున్నట్టు అని? ప్రస్తుతం దీని అవసరం ఏంటి? అసలు ఎవరు మీకు ఈ ఆదేశం ఇచ్చారు అని?  నిజంగా ఈ ఆదేశాలు చైర్మన్ ఇచ్చి ఉంటె.  ఆయనే నేరుగా ఒక సందేశాన్ని మీడియా ద్వారాగానీ, అధికారిక కార్యాలయం ద్వారా గానే విడుదల చేసి ఉండాల్సింది.  అయన గత నెల ఆగస్టు 19 , 2021 న భాద్యతలు అత్యంత అంతర్గతంగా భాద్యతలు చేసుకున్నట్టు

వాట్స్ అప్ ల్లోనే ప్రచారం జరుగుతోంది. నేటి వరకూ సీతంరాజు సుధాకర్ నుంచి బ్రాహ్మణులను ఉద్దేశించి ఒక్క ప్రకటన గానీ, సందేశం గానీ విడుదల కాకపోవడం గమనార్హం. అయన ఎవరో కూడా నేటికీ 80 శాతం మందికి తెలియక పోవడం కాదు శోచనీయం. 

ఇంతకీ ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు?  అధికారిక హోదాలో ఉన్నవారు

ఎంతమంది ?  చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయం నుంచి వచ్చిన వారు ఎవరు? వారు కూడా చైర్మన్ గా సుధాకర్ భాద్యతలు చేపట్టారు అని అధికారికంగా ప్రకటించాక పోవడానికి గల కారణాలు ఏంటి? ఇవే ప్రశ్నలు సగటు బ్రాహ్మణుని మదిలో తిరుగుతున్నాయి.

ఇటీవల కాలంలో ఆన్ లైన్ లో జరుగుతున్నా సైబర్

మోసాల నేపథ్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పేరుతో వస్తున్నా ఫోన్ వాళ్ళు ని నమ్మడం ఎలా?

వీటికి అధికారికంగా సమాధానం చెప్పవలసిన వారు ఇద్దరే. . ఒకరు బ్రాహ్మణ కార్పొరేషన్ అధికారులు, రెండవ వారు స్వయంగా చైర్మన్ సీతంరాజు సుధాకర్.  వీరు అధికారిక ప్రకటన  విడుదల చేస్తే తప్ప ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎలాంటి

వార్తలు వచ్చినా నమ్మడానికి ఆస్కారం లేదు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam