DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాల్లో జరిగే దోషాలకు ప్రాయశ్చిత్తం కోసమే పవిత్రోత్సవాలు

*సింహాచల క్షేత్రంలో శాస్త్రోక్తంగా సాగుతున్న పవిత్రోత్సవాలు*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2021 (డిఎన్ఎస్):* హైందవ సంప్రదాయం లో దేవాలయాలు  ప్రధాన భూమిక వహిస్తున్నాయి. ఆలయాల్లో వైదిక పరమైన కార్యక్రమాలను దోషరహితంగా నిర్వహించడాం కోసం నిరంతరం అర్చక, వైదిక సిబ్బంది కృషి

చేస్తూటున్నారు. తెలిసో తెలియకో దోషాలు జరిగి ఉంటె. .వాటి ని నివృత్తి చేసి, ప్రాయశ్చిత్త పరిహారం కోసం నిర్వహించేవే పవిత్రత్సవాలు అని పేరు. ఇవి దాదాపుగా అన్ని దేవాలయాల్లోనూ ఏడాదికోసారి నిర్వహిస్తుంటారు. 

విశాఖ నగరానికి అత్యంత సమీపంలోని సింహాచల క్షేత్రం పై వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో

సైతం శ్రీ పాంచరాత్ర ఆగమ విధానం ప్రకారం ఈ నెల 16 నుంచి 20 వరకూ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో జరిగే పవిత్రోత్సవాలు ఆలయ స్థానాచార్యులు ఎస్ టి పి రాజగోపాల్ తెలియచేసారు. 

భాద్రపద శుద్ద దశమి నుంచి చతుర్దశి వరకూ జరిగే ఈ కార్యక్రమాల్లో 16 న సాయంత్రం  అంకురారోపణం,  మృత్సంగ్రహణం, ఋత్విక్ వరుణం తో

పవిత్రోత్సవాలు ఆరంభమయ్యాయి. 
రెండవరోజైన 17 న కుంభా వహనం, చక్రబ్జా అనుదర్శనం, చతుస్థానార్చనమ్ జరుగుతుందని, 18  న స్వామికి పవిత్ర సమర్పణం జరుగుతుందన్నారు. 19 న పూర్ణాహుతి, పవిత్ర విసర్జనం తో ప్రధాన కార్యక్రమం ముగుస్తుందన్నారు. 20 న ఏకాంత స్నాపనం తో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 

ఏడాది కాలంలో తెలిసో, తెలియకో

అర్చక, వైదిక, అర్చాకేతర సిబ్బంది, అధికారులు, భక్తుల వల్ల జరిగిన దోషాల కు పరిహారం కోసం చేసే ప్రాయశ్చిత్త వైదిక ప్రక్రియ మాత్రమే పవిత్రోత్సవాలు అన్నారు. మంత్ర లోపం, క్రియ లోపం, ద్రవ్య లోపం, న్యూనతా గానీ, అధికంగానే ఉంటె వాటిని సమానం చెయ్యడం కోసం జరిగే మంత్రం ప్రక్రియా వైదిక కార్యక్రమం అని తెలిపారు. దీనిలో చతుర్వేద

పారాయణ, దివ్య ప్రబంధ పారాయణ, హోమాలు జరుగుతాయని తెలిపారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam