DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కళాభారతి వార్షిక వేడుకల్లో ఆకట్టుకున్న శ్రీ కృష్ణ రాయబారం

*నాటకానికి ముగ్దులై లక్ష బహుమానం ఇచ్చిన ఎంఎస్ఎన్ రాజు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2021 (డిఎన్ఎస్):* విశాఖ లోని కళాభారతిలో జరుగుతున్న వీఎండీఏ, కళాభారతి వార్షిక వేడుకల్లో ఆఖరి రోజున గుమ్మడి  గోపాలకృష్ణ దర్శకత్వం వహించి శ్రీ కృష్ణుడి పాత్రలో నటించిన శ్రీ కృష్ణ రాయబారం

 పద్య నాటకం అందరిని ఆకట్టుకుంది. 

ప్రఖ్యాత అవధానులు తిరుపతి వెంకట కవులు రచించిన పాండవోద్యోగం పద్య నాటకం కృష్ణ రాయబారం వరకు అద్భుతంగా ప్రదర్శించి పాత్రధారులందరూ ఆ పాత్రలో ఇమిడి నిమగ్నమై మనం ద్వాపరయుగం వెళ్ళామా  ఉన్నామా అన్నట్టుగా ప్రదర్శించి శ్రోతల చప్పట్లుతో  హాలు

మారుమోగిపోయింది. 

కార్యక్రమం లో కళాభారతి అధ్యక్షులు ఎంఎస్ఎం రాజు, కార్యదర్శి గుమ్ములూరి రాంబాబు, అతిథులు పరుచూరి రఘునాథరావు చైర్మన్ కనకమహాలక్ష్మి బ్యాంక్, కృష్ణ పాత్రధారి  గుమ్మడి గోపాలకృష్ణ, డాక్టర్  ఎస్. విజయ్ కుమార్ లు పాల్గొన్నారు. 

మొదట అంకం లో శ్రీ కృష్ణ పరమాత్మ నుండి సాయం

అర్థించడానికి ముందుగా వచ్చిన దుర్యోధనుడు శ్రీ కృష్ణుని తల దగ్గర తర్వాత వచ్చిన అర్జునుడు శ్రీ కృష్ణుని పాదాల చెంత కూర్చోవడం, ధర్మాత్మ చతురతతో పాండవ పక్షపాతంగా దగ్గర కూర్చున్న అర్జునుడు మొదటిగా చూసి ఏమి కావాలో కోరుకోమని కోరడం అర్జునుడు నీవే తన పక్షాన కావాలని అడగడం, దుర్యోధనుడు చతురంగ ఫలాలు కావాలని కోరుకోవడం. ఈ

సన్నివేశం ప్రదర్శించిన తీరు ప్రతి ఒక్కరూ ఆనందంతో మాటిమాటికీ కరతాళధ్వనులతో అభినందించారు. 

రెండవ అంకం లో హస్తినాపురికి పరమాత్మను రాయబారిగా పంపించే సన్నాహాలు తో మరియు ద్రౌపతి పంచపాండవులు వారి వారి అభిప్రాయాలను శ్రీ కృష్ణ పరమాత్మ కు వ్యక్తపరచడం. 

ఇక మూడవ అంకం లో నాటకం పతాక శీర్షికకు

వెళ్ళింది. ఈ సన్నివేశంలో శ్రీకృష్ణ రాయబారం, చెల్లకో, జెండాపై కపిరాజు, ఆణిముత్యాల్లాంటి పద్యాలతో ఆబాల గోపాలాన్ని ఆనందపరవసులను చేసింది. 

ఈ నాటక ప్రదర్శనకు ముగ్దులైన కళా భారతి అధ్యక్షులు  మంతెన సత్యనారాయణ రాజు ఈ బృందానికి లక్ష రూపాయలు అందించి, తన నాటక ప్రియత్వాన్ని ప్రకటించారు. 

గోపాలకృష్ణ

కు "పద్యనాటక కళాభారతి" అనే బిరుదుతో ఘనంగా సత్కరించి గౌరవించారు. 

ఈ నాటకం లో ధర్మరాజు గా అంజి రెడ్డి, భీముడు గా సుబ్బయ్య ఆచారి, అర్జునుడు గా రంగారావు, ధృతరాష్టుడు గా తోట  సత్యనారాయణ, దుర్యోధనుడు గా శ్రీనివాసరావు, కర్ణుడుగా DSP రావు, అశ్వత్థామ గా డా. శూరిపాణి, ద్రౌపది గా శ్రీమతి P. మణిబాల
సంగీతం కొడాలి

రాజా, యడవల్లి నానిబాబు, ఆహార్యం శ్రీ పరమేశ్వర. 

ఈ ఏడు రోజుల ఉత్సవాలను తిలకించి విజయానికి దోహదపడ్డ ప్రేక్షకులకు, విస్తృతంగా ప్రచారం చేసిన మీడియా వారికి కళాభారతి కార్యదర్శి రాంబాబు ధన్యవాదాలు తెలిపారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam