DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ లో ఈ ఒక్కరోజే 2.2 కోట్లకు పైగా వ్యాక్సిన్లు, ఒక రికార్డు 

*గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతి చోటా కొరోనా వ్యాక్సిన్లు కేంద్రాలు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2021 (డిఎన్ఎస్):* కోవిడ్ మహమ్మారిని అదుపు చెయ్యడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన యుద్దప్రాతిపదిక కార్యాచరణ శుక్రవారం ఒక రికార్డ్ సృష్టించింది. కేవలం ఒక్కరోజులోనే 2

కోట్ల 23 లక్షల మందికి పైగా టీకా వేయించారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇంతవరకూ ఒక్కరోజులోనే ఇంతపెద్ద సంఖ్యలో టీకా వేయించలేదు. కేవలం భారత్  దేశం మాత్రమే ఈ మొత్తం లో టీకాలు వేయించి ఒక రికార్డ్ సృష్టించింది. గ్రామా స్థాయిలోని గల్లీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకూ ప్రతి చూతా టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక

డ్రైవ్ లను నిర్వహించారు. కొరోనా మొదటి రెండు దశల్లోనూ భారత్ లో ప్రజలను ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రజలను కాపాడేందుకు విస్తృత ఏర్పాట్లను చేశారు. దీనికై  అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని అయన వదులుకోలేదు. 

ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఎంత హేళన చేసినా, ప్రజల్లో నిరాశ కల్గించినా, దేశ ప్రజలు

మాత్రం మోడీ ప్రయత్నానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, ప్రతిపక్షాల కుట్రపూరిత ప్రకటనలను తిప్పికొట్టారు. 

ఇప్పడికే ప్రపంచ దేశాలన్నీ భారత్ ను విశ్వగురు గా గుర్తించి, సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. 
భారత దేశం ఈ ప్రత్యేక రికార్డు సాధించిన రోజు అయన జన్మదినం కావడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam