DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పద్మనాభంలో 20 ఏళ్ళ మోడీ రాజకీయ ప్రస్థాన వేడుకలు 

*మాస్క్ తప్పని సరి: బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2021 (డిఎన్ఎస్):* భారత ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినోత్సవం సందర్బం గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలై 20 ఏళ్లు గడిచిన సందర్బంగా భారతీయ జనతా పార్టీ 20 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తోంది.

విశాఖ జిల్లా పద్మనాభం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి మహంతి అప్పలరమణ ( శ్రీనివాస్) ఆధ్వర్యవంలో  ఈ నెల 17వ తేది నుండి అక్టోబరు 7వ తేది వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండవ రోజు శనివారం పాండ్రంగి గ్రామ పంచాయతీ కురపల్లి గ్రామములో ప్రత్యేకంగా వాక్సినేషన్ శిబిరం లో సుమారు 30 మంది పైగా వాక్సినేషన్ మొదటి ,రెండవ

దోసులను వేయంచడం జరిగింది. ఈ సందర్బంగా అప్పల రమణ మాట్లాడుతూ వాక్సిన్ రెండు డోస్ లో వేయించుకున్నప్పడికీ ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్  లు ధరించాలని తద్వారా హెచ్చరికగా ఉండాలన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ  శీతల పానీయం ( ఓ ఆర్ ఎస్ ) అందించారు. కార్య్కర్మం లో మండల ప్రధాన కార్యదర్శి పాలూరి కృష్ణారావు, యువ మోర్చ

అధ్యక్షులు హంస మహేష్ , ఓబీసీ అధ్యక్షులు రీసు ఎర్రి నాయుడు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam