DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కౌంటింగ్ ఉదయం 8 గంటలకి ప్రారంభించాలి: విశాఖ కలెక్టర్

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2021 (డిఎన్ఎస్):* ఆదివారం జరుగనున్న ఎంపిటిసి., జెడ్పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబందించి అన్ని కౌంటింగ్ హాల్స్ వద్ద ఉదయం 8 గంటల కల్లా ప్రారంభించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  ఓట్ల లెక్కింపు అధికారులను, సిబ్బందిని

ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లుతో సిద్దంగా ఉండాలన్నారు. 

19వ తేది ఆదివారం ఓట్ల లెక్కింపు పురస్కరించుకొని  శనివారం జిల్లా కలెక్టర్ అనకాపల్లి, మునగపాక, అచ్చుతాపురం మండలాలలో  పర్యటించి  అక్కడ ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ అధికారులు, సిబ్బందితో  కౌంటింగ్ కు

అవసరమైన అన్ని ఏర్పాట్లను  పగడ్భందిగా చేపట్టాలని ఆదేశించారు.  నిరంతర విద్యుత్తు , గాలి, వెలుతురు ఉండాలని  శానిటేషన్, నిరంతర నీటి సౌకర్యం, తదితర మౌళిక వసతులతో సిద్దంగా ఉండాలన్నారు. 
 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు  కౌంటింగ్ ఏజెంట్లకు సంబందిత రిటర్నింగ్

అధికారులు గుర్తింపు కార్డులను ఇచ్చి లోపలకు పంపించాలన్నారు.  కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా  సామాజిక దూరం పాటిస్తూ  సీటింగ్ ఏర్పాట్లను చేయాలన్నారు. 
 అచ్చుతాపురం జెడ్.పి.హెచ్ స్కూల్ లో చదువుతున్న విద్యార్ధులతో కలెక్టర్ మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్నం బోజనం చేసారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నదీ లేనిదీ

అక్కడి విద్యార్ధులతోను, టీచర్లతోను అడిగి తెలుసుకున్నారు. విద్యార్దులు తమ పాఠశాలలో ఆట స్థలం  పాడైపోయిందని, బాగు చేయించాలని కోరగా అందుకు కలెక్టర్ స్పందిస్తూ నాడు – నేడు పనులలో భాగంగా గ్రౌండుకు మరమ్మత్తులను చేయించాలని  ప్రధానోపద్యాయులను  ఆదేశించారు.  
 కలెక్టర్ పర్యటనలో అనకాపల్లి ఆర్.డి.ఓ., సీతారామరావు,

నియోజక వర్గ ప్రత్యేక అధికారులు,ఇతర అధికారులు హాజరైయారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam