DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నమామి గంగే కోసం ప్రధాని మోడీ కి వచ్చిన గిఫ్ట్ ల వేలం 

*గంగ  ప్రక్షాళన లో అందరూ పాల్గొనండి: ప్రధాని మోడీ*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 20, 2021 (డిఎన్ఎస్):* భారత దేశంలో సుదీర్ఘ ప్రాంతాల్లో విస్తరించిన అత్యంత పవిత్రమైన గంగానది ప్రక్షాళన  కోసం నమామి గంగే ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. జరుగుతున్న నిధుల సేకరణకై భారత ప్రధాని

నరేంద్ర మోడీ ఒక హత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. దీని లో భాగంగా గత ఏడు సంవత్సరాల కాలంలో ఇతరులు తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన బహుమతులను వేలం ద్వారా విక్రయించనున్నారు.  ఈ మేరకు అయన దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ వేలంద్వారా వచ్చిన నిధులను నమామి గంగే ప్రాజెక్ట్ కోసం వినియోగించనున్నారు. ఇతర దేశాధినేతలు, రాష్ట్రాధినేతలు,

ఒలింపిక్స్ విజేతలు, పారిశ్రామికవేత్తలు, అంతంత సామాన్యులు ఇలా అందరూ ఇచ్చిన బహుమతులను  ఇంతకాలం ఎంతో జాగ్రత్తగా భద్రపరిచారు. వీటిని విక్రయించడం ద్వారా వచ్చే భారీ నిధులను పూర్తిగా నమామి గంగే ప్రాజెక్ట్ కోసం వినియోగించనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

ఈ వేలం సెప్టెంబర్

17  నుంచి అక్టోబర్ 7 వరకూ దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయి. అందరూ పాల్గొనవచ్చు. దీనికోసం ఆన్లైన్ లో https://pmmementos.gov.in ఒక వెబ్ సైట్ ను తెరిచారు. మొత్తం వేలం లో ఉన్న వస్తువులు అందులో ప్రకటించబడ్డాయి. ఈ వేలం కు అద్భుతమైన స్పందన వస్తోందని కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజ్జు  తెలిపారు. 

వేలంలో ఉన్న వస్తువుల్లో

కొన్ని ప్రధానమైనవి: . 

ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ స్టార్‌ల క్రీడా పరికరాలు, వాళ్ళు ఇచ్చిన బహుమతులు, రామ్ జన్మభూమి జ్ఞాపికలు, తిరుమల వెంకటేశ్వర స్వామి ఇలా అన్ని బహుమతులనూ  అయన వేలం లో ఉంచవలసిందిగా సూచించారు. దీని ద్వారా వచ్చే ప్రతి రూపాయినీ  నమామి గంగే  ప్రాజెక్ట్ కు వినియోగించాలని సూచించారు.

 వీటిల్లో బంగారు, వెండి, కాంస్యం, వస్త్రం, కర్ర, సహా అన్ని రకాల ముడి పదార్దాలతో తయారు చేసిన వస్తువులు, క్రీడాకారులు తాము అంతర్జాతీయ వేదికల్లో పతకాలు గెలిచినా క్రీడా సామాగ్రిని కూడా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా ఇ-వేలంలో గరిష్ట బిడ్‌లను గీస్తున్న మెమెంటోలు వందల్లోనే ఉన్నాయి. అయితే అధిక ధర పలికే వస్తుంవులు

చాలానే ఉన్నాయి. 

వాటిల్లో నీరజ్ చోప్రా యొక్క జావెలిన్  ప్రస్తుతం రూ. 11 కోట్లు పైగా వేలం పలుకుతోంది. పివి సింధు  రాకెట్ , బాడ్మింటన్ బాగ్  ప్రస్తుతం రూ. 10 కోట్లు పైగా వేలం పలుకుతోంది. ఇతర వస్తువులు సైతం కోట్ల రూపాయల్లోనే పరుగులు పెడుతున్నాయి. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam