DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజ శ్రేయస్సు కోసమే చాతుర్మాస దీక్ష చేపట్టాం

*విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 20, 2021 (డిఎన్ఎస్):* సమాజ శ్రేయస్సు కోసమే చాతుర్మాస్య దీక్ష చేపట్టానని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. ఋ ఋషికేశ్ వద్ద గంగాతీరంలో చేపట్టిన దీక్ష దిగ్విజయంగా

పూర్తయిందన్నారు. సోమవారం దీక్ష ముగించుకుని పీఠాధిపతులు  స్వరూపానందేంద్ర స్వామి విశాఖకు చేరుకున్నారు. స్వామీజీకి పీఠం భక్తులు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ చాతుర్మాస్య దీక్షను తపస్సుగా భావించినట్లు చెప్పారు. నిత్యం గంగా స్నానమాచరించి, రాజశ్యామల అమ్మవారి అనుష్టానం మధ్య

దీక్ష చేసామన్నారు. ఆదిశంకరాచార్యుల భాష్య విచారణ చేసామని చెప్పారు. గంగాతీరంలో ఏటా తపస్సు చేసే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం అని వివరించారు. గంగమ్మ దీవెనలు అందుకుని విశాఖకు తిరిగి వచ్చానని చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి విశాఖ శ్రీ శారదా పీఠానికి చేరుకున్న పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి భక్తులు సాంప్రదాయ

పూర్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మేళతాళాలు, కోలాటం మధ్య ఆహ్వానించారు. పీఠం ముఖద్వారం వద్ద స్వామీజీ గోపూజ నిర్వహించారు. అనంతరం పీఠంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు.  శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాతుర్మాస్య దీక్షను విజయవంతంగా పూర్తి చేసి విశాఖకు తిరిగి

వచ్చిన స్వామీజీకి భక్తులు ఘన స్వాగతం పలికారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam