DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల పవిత్ర క్షేత్రం.. పొలిటికల్ పునరావాసం కాదు 

*టిటిడి బోర్డులో జీయర్లు మాత్రమే ఉండాలి, వాళ్లకి  స్థానం లేదా?   

*హిందూ ఆలయాలకు కమిటీలు ఎందుకు?: ధార్మిక సంఘాలు*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 21, 2021 (డిఎన్ఎస్):* తిరుమల తిరుపతి దేవస్థానముల ట్రస్ట్ బోర్డు లో రికార్డు స్థాయిలో 81 మందిని నియమించడం సర్వత్రా

వివాదంగా మారింది. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు, భక్తులు మండిపడుతున్నారు. సాధారణంగా టిటిడి లో ఏ పని చెయ్యాలన్న అధికారం కేవలం ఉద్యోగులకు, అధికారులకు మాత్రమే ఉంటుంది. దీని నిర్వహణకై  భగవద్రామానుజాచార్యులు 11 వ శతాబ్దంలోనే ఈ ఆలయ నిర్వహణ భాద్యతలను జీయర్ వ్యవస్థకు అప్పగించారు. నాటి నుంచి నేటికీ

తిరుమల పెద్ద జీయర్, చిన్న జీయర్ ల నిర్వహణే కొనసాగుతోంది. అయితే పాలకమండలి కి పనేమీ ఉండదు. బోర్డు లో ఉండవలసిన వాళ్ళు ఇద్దరు తిరుమల జీయర్లు మాత్రమే. ఆ పాలకులు వీళ్ళిద్దరినీ తప్పించి, అస్సలు ఆగమం, ఆలయం గురించి అస్సలు ఏమీ తెలియని నిరక్షరకుక్షులను నియమించడం ఏంటని ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.  

 

కోట్లాది మంది హిందూ భక్తుల ఆరాధ్యదైవమైన తిరుమల వెంకేటేశ్వరునికి సేవ చేసేందుకు లక్షలాదిమంది సిద్దంగానే  ఉన్నారు. అయితే వీరు స్వచ్చందంగా నిస్వార్ధంగా సేవ చేసేందుకు సొంత ఖర్చులు పెట్టుకుని మరీ తిరుమలకు వస్తుంటారు. 

అయితే ప్రభుత్వం ట్రస్ట్ బోర్డు పేరుతో 81 మందికి వేలు, లక్షల్లో రూపాయలు

ఖర్చులు, రాజభోగాలు,  ఎదురు ఖర్చులు ఇచ్చి మరీ తిరుమలకు సేవకులుగా తీసుకోవడం పట్ల హిందూ ధార్మిక  సంఘాలు మండిపడుతున్నాయి. వీళ్ళలో చాలామంది పలు వివాదాల్లో ఉన్న వాళ్ళు కావడం గమనార్హం.  
  
ఈ దేశంలో హిందూ దేవాలయాలు నిర్మించినపుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు, పాలకులూ లేరు. అసలు ఈ ఆలయాల అభివృద్ధి కోసం ప్రభువా

ఖజానా నుంచి రూపాయి   కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవి కమిటీలు, ట్రస్ట్ బోర్డులు లేకుండానే కొన్ని వేల సంవత్సరాల నుంచి వైభవంగా నిర్వహించబడుతున్నాయి. 

ఇప్పుడు కొత్తగా వచ్చి వీళ్ళు పెద్దగా ఉద్దరించేది ఏమీ ఉండదని ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. చాలా మంది సభ్యులకు ఆలయ చరిత్ర,  వైభవం, ప్రాధాన్యత గురించి

అవగాహనా లేదన్నాయ్. అసలు ఆలయంలో మూలవిరాట్ కు ఉన్న పేరు ఏంటో కూడా తెలియని వాళ్ళు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉద్దరించబడుతున్నారని ఎద్దేవా చేస్తున్నాయి.  
 
పైగా ఎంతమంది హిందూ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నవాళ్ళు ఉన్నారో అనుమానమేనన్నాయి. ప్రతి సభ్యుని చేత వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర గద్యం, అన్నమయ్య పాటలు

అన్నీ బట్టీపట్టించాలని డిమాండ్ చేస్తున్నాయి.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam