DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని మోడీ నిర్ణయంతో మతమార్పిళ్లకు అడ్డుకట్ట పడింది  

*విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 21, 2021 (డిఎన్ఎస్):* ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాలతో దేశంలో అన్యమత ప్రచారం, మత మార్పిడులు నియంత్రణలోకి వస్తున్నాయని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ

స్వామి అన్నారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొన్ని సంస్థలు విదేశాల నుంచి మిషనరీ నిధులు తీసుకొచ్చి నిరుపేద వర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రలోభాలకు గురి చేస్తున్నాయని తెలిపారు. విదేశాల నుండి వచ్చే నిధులపై ఆంక్షలు విధించడం ద్వారా మోడీ ప్రభుత్వం హిందూ ధర్మానికి మేలు చేసిందని ప్రశంసించారు. 
మంగళవారం

స్వాత్మానందేంద్ర సరస్వతీ  స్వామి ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్ సింగ్, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీలను వారి నివాసాల్లో కలిసారు. కేంద్రమంత్రులతో పలు ధార్మిక అంశాలపై చర్చించారు. 
తెలుగు రాష్ట్రాల్లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు

స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ధర్మ పరిరక్షణకు చేపడుతున్న కృషిని, తాను చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర గురించి వివరించారు. దళితులు, గిరిజనులతో కలిసి తిరుమలకు వెళ్ళినట్లు తెలిపారు. మురళీధర్  దంపతులు స్వామీకి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.  అక్షరాస్యత ఎక్కువగా ఉన్న కేరళ రాష్ట్రంలో విదేశీ మతాల ప్రభావం

అధికంగా ఉందని మురళీధర్ జీ ఆందోళన వ్యక్తం చేసారు. అటువంటి ప్రాంతాల్లో హిందూ ధర్మ ప్రచారం చేపడితే తాము సహకరిస్తామని హామీనిచ్చారు. విశాఖ శ్రీ శారదాపీఠం వేద పాఠశాల నిర్వహిస్తున్న విషయం తెలుసుకుని ఆనందం వ్యక్తం చేసారు. కేంద్రమంత్రి మురళీధర్ సతీమణితో స్వాత్మానందేంద్ర స్వామి సంస్కృతంలోనే సంభాషించారు. అనంతరం

గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసారు. 
దేశంలోని పీఠాధిపతులు, మహా మండలేశ్వరులు, మఠాధిపతులంతా ఏకమై హిందూ ధర్మాన్ని పటిష్టం చేయడానికి కృషి చేయాలని మంత్రి స్వామీజీని కోరారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అన్యమతాల ప్రభావం అధికంగా ఉందన్నారు. రాబోయే 20 సంవత్సరాలు కీలకమైనవిగా పరిగణించి, హిందూ ధర్మాన్ని

పటిష్ఠం చేసేందుకు కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ధర్మ ప్రచారం చేయాలని, ధార్మిక సమ్మేళనం నిర్వహించాలని అభిప్రాయ పడ్డారు. 
కేంద్ర మంత్రులకు స్వామీజీ ఆదిశంకరాచార్య ప్రతిమను బహూకరించి, రాజ శ్యామల అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. త్వరలో పీఠం నిర్వహిస్తున్న శ్రీ శారదా స్వరూప

రాజశ్యామల శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానించారు. స్వామీజీ వెంట బీజేపీ జాతీయనేత రఘురామ్, టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు నాదెండ్ల సుబ్బారావు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam