DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికార పార్టీకి, నాయకుడికి ద్రోహం చేస్తే సహించేది లేదు 

*రాజమండ్రి ఎంపీ భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి ఆగ్రహం*   

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 21, 2021 (డిఎన్ఎస్):* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, నాయకుడికి ద్రోహం చేస్తే ఉపేక్షించేది లేదని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. రాజమహేంద్రవరం తాడితోట లోని సంహిత

డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఇబ్బంది పెట్టిన  జెడీ లక్ష్మీనారాయణతో కలిసి ఎంపి భరత్ సెల్ఫీలు ఎలా దిగుతారని ప్రశ్నించారు. 
జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి మాకు బద్ధశత్రువు అని పేర్కొన్నారు. జిల్లాలో 19

నియోజకవర్గాల్లో రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కడియం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కొందరు వ్యక్తులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం అయ్యారని ఆరోపించారు. 
రాజమహేంద్రవరం లో వైసిపి పార్టీని ఎంపి భరత్ సర్వనాశనం చేస్తున్నారని

అన్నారు. టిడిపి ఎమ్మెల్యే గోరంట్లతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రౌడీషీటర్లు, భూకబ్జాదార్లు  ఎం.పి భరత్ వెనుక ఉన్నారని వివరించారు.

స్వార్ధపరులు తనపై కుట్ర పన్నుతున్నారని ఎన్ని కుట్రలు చేసినా తన వెంట్రుకకు కూడా పీకలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నాయకుడికి చెడ్డ పేరు తెచ్చే పనులు

చేస్తే సహించేది లేదని అన్నారు. 

జనసేన నాయకుడిని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ సలహా కమిటీ సభ్యుడిగా నియమించడమేమిటని నిలదీసారు. ఎంపి భరత్ వి  పిచ్చిపిచ్చి చేష్టలని తీరు మార్చుకోవాలని  హితవుపలికారు.రాజానగరం నియోజకవర్గంలో నా  వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. నాపై  చెయ్యాల్సిన వ్యాఖ్యలు  చేసేసి చివరిగా

తూచ్ తుచ్ అంటే కుదరదని అన్నారు.  

ఆరు నెలలు ఒక్కసారి పగటి వేషగాడిలా :

మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పగటి వేషగాళ్ళ ఆరు నెలలకు ఒకసారి వచ్చి నాటకాలు వేస్తూ వచ్చి వెళుతుంటాడని విమర్శించారు. ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల చేసిన రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చేసింది ఏమి లేదనీ అన్నారు. ఇసుక

మాఫియా,మట్టి మాఫియా ద్వారా హైదరాబాద్ బెంగళూరులో ఆస్తులు పెంచుకుని లాభాలు గడించుకొన్నారాన్నారు. 

కోవిడ్ సమయంలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా 15 కోట్లు రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపించారని ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు నాపై ఆరోపణలు చేసిన వ్యక్తి పై

కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు దీనిపై కోర్టులో వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam