DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహోద్యమం దిశగా మన దేవాలయాలు మనకే పాదయాత్ర

*ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకూ మహా ధార్మిక యాత్రగా. .* 

*దేవాదాయశాఖ రద్దుకై పోటెత్తుతున్న హైందవ ఉద్యమం*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 21, 2021 (డిఎన్ఎస్):* ప్రభుత్వ హస్తాల్లో చిక్కుకున్న హిందూ దేవాలయాలను తక్షణం ప్రభుత్వ పరిధి నుంచి విముక్తి కల్గించాలని అనే ఏకైక

లక్ష్యంతో  మొదలైన మన దేవాలయాలు మనకే అనే మహా పాదయాత్ర నేడు రూపాంతరం చెందుతోందని నిర్వాహకులు డిఎ‌న్ఎస్వి ప్రసాద్ బాబు తెలిపారు. మంగళవారం విజయవాడ భగవద్రామానుజ సేవాసమితి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ అధ్యక్షులు ప్రసాద్ బాబు మాట్లాడుతూ  హైదరాబాదు కర్మాన్ ఘాట్ హానుమాన్ దేవాలయం వద్ద

ప్రారంభమై విజయవాడ దుర్గ దేవాలయం వరకు దాదాపు 307 కి.మీ పాదయాత్ర పూర్తి చేసినట్టు తెలిపారు. 

హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని, దేవాదాయశాఖ రద్దు కై డిమాండ్ చేస్తూ.జరుగుతున్నా ఈ ఉద్యమంలో తాము కూడా పాల్గొంటామంటూ తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా విస్తృతమైన మద్దతు, సంఘీభావం రావడంతో

పాదయాత్రను విజయవాడ అమ్మవారి సన్నిధిలో తోలి దశ ను పూర్తి చేశామన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల నుంచి పాదయాత్రలు మొదలు పెట్టేందుకు కార్యాచరణ చేపడుతున్నామన్నారు.  

సెక్యులర్ వ్యవస్ధ మత సంస్ధలపై అధికారం కలిగి ఉండటం రాజ్యంగ విరుద్ధమని కాబట్టి తక్షణమే దేవాలయలను హిందు ధార్మిక మండళ్లకు అప్పగించాలని

పిలుపునిచ్చారు.  ఈ ఉద్యమంలో అన్ని ధార్మిక సంస్ధలను కూడా కలుపుకుని ముందుకువెళతామని తెలియజేసారు. 


ఈ పాదయాత్ర మహా ధార్మిక యాత్రగా రూపాంతరం చెంది ఉత్తరాంధ్ర లోని ఇచ్ఛాపురంనుండి విజయవాడ వరకు ఒక బృందం పాదయాత్ర చేస్తుందని,  కర్ణాటక లోని హంపి నుండి రాయలసీమ జిల్లాలను కలుపుతు తిరుపతి వరకు ప్రధాన

దేవాలయాలు, ప్రాంతాల ప్రజలను కలుపుకుంటు మరో బృందం పాదయాత్ర చేస్తూ అందరిలోని ఈ విషయంపై అవగాహన కల్పిస్తామని, తద్వార ఈ అంశంపై ప్రజా మద్దతును కూడగట్టుకుని ప్రభుత్వాలకి తెలియజేస్తామని తెలిపారు.

అంతకు ముందు ఈ యాత్ర చేపట్టిన ధార్మిక బంధువులకు అఖిలభారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గం తరపున

సలహాదారు బి కె ఎస్ ఆర్ అయ్యంగార్,  ప్రధాన కార్యదర్శి బాలబాలాజీ, ఇతర ప్రతినిధులు మన తాత్కాలిక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సి.ఎ‌.పి.,  కోశాధికారి పార్ధసారధి, సంయుక్త కార్యదర్శి రఘు, ప్రచార కార్యదర్శి విద్యావతి తదితరులు సగౌరవ సత్కారం చేసారు. 

ఈ కార్యక్రమంలో తాళ్ళూరు మఠం మఠాధిపతి పి.వి.ఎస్.ఎన్

 ప్రసాదాచార్యులు గారు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పి.టి.జి.వి.రంగాచార్యులుగారు, విశ్వహిందు పరిషత్, భజరంగదళ్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam