DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చకులు సర్వీసు రికార్డుల నమోదుపై దృష్టి పెట్టాలి

*ఆదిశైవ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు సూచన* 
   
*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 22, 2021 (డిఎన్ఎస్):* వివిధ దేవాలయాల్లో సేవలు చేసే అర్చకులు తమ సర్వీసు రికార్డుల నమోదుపై దృష్టి పెట్టాలని ఆదిశైవ సంఘ రాష్ట్ర అధ్యక్షులు యనమండ్ర సత్య సీతారామశర్మ (మురమళ్ళ రాంబాబు) సూచన చేసారు.

 తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో మంగళవారం జరిగిన ఆదిశైవ సంఘం జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ 43(10) రిజిస్టర్ లో నమోదు ప్రక్రియ గురించి అంశాల వారీగా వివరాలను వివరించారు. నాలుగు డివిజన్లులలో రామచంద్రపురం, రాజమండ్రి, పెద్దాపురం, రాజోలు, కాకినాడ, అమలాపురం సంబంధించి ప్రతినిధులకు  సంఘ సభ్యుల నమోదు

ప్రక్రియను ఈ నెలాఖరులోగా పరిశీలించి, పూర్తిచేసేందుకు కృషి చేయాలన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దేవాదాయ శాఖకు చెందిన ఆలయాలలో అర్చక వంశాల వంశపారంపర్య హక్కుల నమోదుపై కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. 

అర్చకులకు ఎన్నో సమస్యలు ఉంటాయని, అన్నింటినీ ఏకకాలంలో సాధించలేమని, దశలవారీగా

 సాధించవలసి వస్తుందన్నారు. అందులో అత్యంత ప్రముఖమైనది దేవాదాయ శాఖ రికార్డులలో అర్చక వంశాల నమోదు ప్రక్రియ అని దశలవారీగా మిగిలిన సమస్యలన్నీ సాధించవచ్చన్నారు.

ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దొంతంకుర్తి కాశీ విశ్వనాథ్ (కాశి ),  జిల్లా కార్యదర్శి విల్లూరి వీరభద్రరావు,  జిల్లా కోశాధికారి

పూజ్యం మణికుమార్,  రాష్ట్ర సహాయ కార్యదర్శి కాళ్లకూరి సాంబమూర్తి,  కడలి సత్తిబాబు,  తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కాళ్లకూరి దుర్గాప్రసాద్,  జిల్లా మీడియా వింగ్ ప్రతినిధి శ్రీకంఠం రాజేశ్వరరావు (బాబి), రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు వెలవలపల్లి హనుమంతరావు, అమలాపురం డివిజన్ సభ్యులు కామేశ్వరరావు,  కాకినాడ

డివిజన్ సహాయ కార్యదర్శి వెంకన్నబాబు,  బాదంపూడి రవి, పెద్దాపురం డివిజన్ కొత్తలంక శ్రీను, రామచంద్రపురం విల్లూరి కృష్ణానందమూర్తి, విల్లూరి సూర్యనారాయణమూర్తి,  కొత్తలంక సునీల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam