DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అచ్యుతాపురం పోలీసుల వైఖరిపై జనసేన మండిపాటు 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 23, 2021 (డిఎన్ఎస్):* అభిజిత్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం పై శాంతియుత నిరసన చేస్తూన్న ఉత్తరాంధ్ర జనసేన పార్టీ అధ్యక్షులు  సుందరపు విజయ్ కుమార్ ను పోలీసులు దౌర్జన్యంగా ఈడ్చుకుంటూ పై జనసైనికులు తీవ్ర ఆందోళన చేపట్టారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం లోని అభిజిత్

పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో లాలం శేఖర్ చెయ్యి పూర్తిగా తీసేయడంతో సుందరపు విజయ్ కుమార్ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లేందుకు ప్రయత్నించగా యాజమాన్యం పరిశ్రమలోనికి అనుమతించకపోవడంపై గేటు ముందు బైటాయించి ధర్నా చేపట్టారు. యలమంచిలి సిఐ అతని సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఎటువంటి చర్చలు జరపకుండా బలవంతంగా ఈడ్చుకుంటూ

అచ్యుతాపురం పోలీసు స్టేషనుకు లాక్కుపోయారు. ప్రజా ప్రతినిధిలుపై పోలీసులు జులూం నసించాలని జనసైనికులు నినాదాలు చేసారు. పోలీసుల దౌర్జన్యంతో ఉధ్యమాలను ఆపలేరని విజయ కుమార్ హెచ్చరించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ ఆందోళన ఉదృతం చేస్తామని, త్వరగా సమస్య పరిస్కారం చేయకపోతే బారీ స్థాయిలో ఆందోళన చేపడతామని జనసైనికులు

హెచ్చరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam