DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయస్తూప అభివృద్ధి పై సింహాచల ఈఓ నిర్ణయం అభినందనీయం

*పద్మనాభం బీజేపీ ప్రధాన కార్యదర్శి మహంతి శ్రీనివాసరావు హర్షం* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 23, 2021 (డిఎన్ఎస్):* శ్రీకృష్ణ దేవరాయులు 1516 లో సింహాచల క్షేత్రము లో పై నెలకొల్పిన విజయస్థూపానికి చారిత్రక పూర్వ వైభవం తీసుకువస్తామని,  శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈఓ

సూర్యకళ తీసుకున్న నిర్ణయం పట్ల పద్మనాభం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి మహంతి అప్పల రమణ హర్షం వ్యక్తం చేసారు. 
దక్షిణ దేశ విజయ యాత్ర అనంతరం శ్రీకృష్ణ దేవరాయలు సింహాచల క్షేత్ర దర్శనానికి వచ్చి శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామిని దర్శించుకున్నారన్నారు. విజయ యాత్ర కు గుర్తుగా సింహాచల గిరిపై దేవరాయలు ఈ విజయ

స్తూపాన్ని నెలకొల్పారన్నారు. శతాబ్దాల నాటి వైభవాన్ని తిరిగి అభివృద్ధి చేసేందుకు ఈఓ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఈఓ సూర్యకళ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam