DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం అత్యుత్తమైన స్థలం: కేంద్రమంత్రి ఠాకూర్ 

*కేంద్రమంత్రి కారు కూడా గోపురం వద్దకు నో ఎంట్రీ: ఆలయ సిబ్బంది*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 24, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు అయిన శ్రీవరాహాలక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, సింహాచలం అద్భుతంగా ఉందని, ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఆలయాల్లో ఇది ఒకటి అని కేంద్ర పోర్ట్,

షిప్పింగ్, జలవనరుల శాఖామంత్రి సంతన్ ఠాకూర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం స్వామిని దర్శించుకున్నారు. కేంద్రమంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి, స్వామి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచన ఆశీస్సులను అందించారు. ఆలయ చరిత్ర, ఆలయంలో జరుగుతున్నా వేడుకలు, నిర్వహణ,

వివరించారు. 

కేంద్రమంత్రి కారును కూడా ఎంక్వయిరీ గేట్ వద్దే రాజా గోపురానికి 200 మీటర్ల దూరం అవతలే క్రింది స్థాయి సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు నిలిపి వెయ్యడంతో ఆయన ఇంతదూరం నడుచుకుంటూనే వెళ్లడం గమనార్హం. అయినా కూడా కేంద్రమంత్రి సిబ్బంది ప్రవర్తన చాలా బాగుంది అంటూ రికార్డు పుస్తకంలో వ్యయడం గమనార్హం.  
/>  
ఎంపీ కి మడుగులొత్తే . . ఈఓ కానరాలేదు. . .

ఒక సాధారణ రాజ్యసభ సభ్యుడు దేవాలయ దర్శనానికి వస్తే. .మొత్తం ఆలయ ఈఓ నుంచి క్రింది స్థాయి సిబ్బంది వరకూ అతని అడుగులకు మడుగులొత్తిన విషయం తెలిసిందే. 
శుక్రవారం కేంద్ర క్యాబినెట్ మంత్రి ఆలయ దర్శనానికి వస్తే. .ఆలయం ఈఓ ఎంవి సూర్యకళ గైర్హాజరు అయ్యారు. ఈమె రాకపోగా ఒక

ప్రయివేట్ పీఆరో ను ఏర్పాట్లు చూడమని చేతులు దులుపుకోవడం పై విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖా మండిపడుతోంది.  

ఆలయ అభివృద్ధికి ప్రసాద్ పథకం ద్వారా  రూ. 53  కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర మంత్రి విచ్చేసిన సందర్భంలో ఈఓ ప్రోటోకాల్ పాటించక పోవడం చూస్తుంటే ఈమె సింహాచల క్షేత్రానికి సేవలో

కాకుండా రాష్ట్ర అధికార పార్టీ కి సేవకులోనే తరిస్తున్నారంటూ విహెచ్పి నేతలు మండిపడుతున్నారు.  

మంత్రి వెంట స్థానిక పార్టీ బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam