DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరిపైకి యధేచ్చగా అన్యమత స్టికర్ల వాహనాలు రాక 

*కేంద్రమంత్రి కాన్వాయ్ లోనే ఒకటి, ప్రయివేట్ భక్తులతో ఇంకోటి*  

*మీ సెక్యూరిటీ కన్నుగప్పి కొండపైకి ఎలా వచ్చాయి ఈఓ గారూ.?

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2021 (డిఎన్ఎస్):* తప్పులెన్నువారు తమతప్పులెరుగరు అనే శతక కవి నానుడి శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం

సింహాచలం అధికారులకు సరిగ్గా సరిపోతుంది. ఈ ఆలయం కొండపైకి వెళ్లే వాహనాల్లో అన్యమత వాక్యాలు, గుర్తులు ఉన్న వాహనాలను అనుమతించరు. కొండ క్రింద టోల్ గేట్ దగ్గర  ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వీటిని తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు. గేట్ దగ్గరే పెద్ద బ్యానర్ ను కూడా ఆలయ అధికారులు పెట్టడం గమనార్హం. 

అయితే వీళ్ళ పని

తీరు సక్రమంగా లేని కారణంగా ఇటీవల కాలం లో అనుమాట స్టైక్కెర్లు ఉన్న వాహనాలు యధేచ్చగా కొండపైకి వెళ్తున్నాయి. దీనికి నిదర్శనమే శుక్రవారం రెండు వాహనాలు క్రైస్తవ మత వాక్యాలు స్టిక్కర్లు ఉన్న వాహనాలు రెండు కొండపైకి వెళ్లాయి. వాటిల్లో ఒకటి ఉదయం కేంద్రమంత్రి  కాన్వాయ్ లో పోలిసు వాహనం కూడా ఉండడం గమనార్హం. రెండోది

మధ్యాహ్నం ప్రయివేట్ భక్తులతో వచ్చినట్టు తెలుస్తోంది.   

శుక్రవారం దేవస్థానం స్వామి దర్శనానికి కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్ కాన్వాయ్ లో ఒక పోలీస్ సిబ్బంది బొలెరో కారు పై అన్యమత వాక్యాలు ఉండడం గమనార్హం. అయితే కొండపైకి అన్యమత స్టిక్కర్ల కార్లు వెళ్ళకూడదు అని తెలిసిన పొలిసు అధికారులు కూడా పట్టించుకోక

పోవడం గమనార్హం.  ఈ వాహనం ఉదయం కొండపైకి వెళ్ళింది. 

అదే సమయంలో మధ్యాహ్నం మరో కారు కూడా కొండపైకి వెళ్ళింది. ఈ కారు మీద కూడా అన్యమత సంబంధ వాక్యాలు ఉన్న స్టిక్కర్లు ఉండడం గమనార్హం. ఈ కారు నేరుగా  సింహాచలం ఆలయం రాజా గోపురానికి ఎదురుగా నిలడం గమనార్హం. 

అయితే మధ్యాహ్నం వచ్చిన వాహనం గురించి మీడియా

లో వార్తలు రావడంతో ఖంగుతున్న ఈఓ కార్యాలయం ఉదయం వచ్చిన కేంద్ర మంత్రి కాన్వాయ్ లోనే ఈ వాహనం ఉంది అంటూ మీడియా కు నోట్ విడుదల చేసింది. 

శుక్రవారం కొండపైకి వచ్చినవి రెండు వాహనాలు అయితే కేవలం ఒక్క వాహనం పైనే ఈఓ వివరణ ఇవ్వడం గమనార్హం. 

అసలు ఇంతపెద్ద విఐపి అయినా వాళ్ళతో వచ్చే వాహనాల్లో అన్యమత

స్టిక్కర్లు ఉంటె అడ్డుకోవాల్సిన భాద్యత సింహాచల దేవస్థానం సెక్యూరిటీ సిబ్బందిదే. 

ఎదుటి వారిలో తప్పులు వెదికే దేవస్థానం అధికారులు తమ తప్పును మాత్రం ఎదుటివారిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ ఘటనలో అందరి తప్పు కనపడుతోంది. కొండపైకి వెళ్లే టోల్ గేట్ దగ్గరే పెద్ద బ్యానర్ ఉంటుంది. ఏ వాహనమైన ఈ

గేట్ నుంచి వెళ్ళవలసిందే.  కాన్వాయ్ లో ఉన్న పోలీస్ అధికారులకు సైతం ఈ విషయం తెలిసి ఉంటుంది. వాళ్ళు ఉన్న వాహనం పై ఉన్న స్టిక్కర్ ను తొలగించాకే కొండపైకి ఏళ్ళవలసి ఉంది.  ఇక సెక్యూరిటీ సిబ్బంది కాన్వాయ్ ను కూడా పరిశీలించాల్సి  ఉంది. అది వాళ్ళు చెయ్యలేదు. పైగా వాహనం వేగంగా వెళ్ళింది అంటూ సాకులు చెప్తున్నారు. ఈ వాహనం

సరే. . .మరి మధ్యాహ్నం వాహనం ను ఎందుకు వదిలి పెట్టారో ఈఓ ప్రెస్ నోట్ లో చెప్పలేదు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam