DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ బ్రాహ్మణా కార్పొరేషన్ దేవాదాయ శాఖ లోనే కొనసాగాలి  

*శాఖా మార్పు జరిగితే న్యాయపోరాటం చేయడానికి సిద్ధం*  

*అఖిల భారత వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రకటన* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2021 (డిఎన్ఎస్):*ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పోరేషన్ ని దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధి నుండి బి.సి. సంక్షేమ శాఖ పరిధిలోకి మారుస్తూ

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాజపత్రం పై అఖిలభారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజీ శనివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ను వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ పరిధిలోకి బదిలీ చేస్తూ ఈనెల 23 న తీసున్నా నిర్ణయం పూర్తిగా

బాధ్యతారాహిత్యంతో అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో న్యాయ, ధర్మ పోరాటానికి సిద్ధ పడతామని తెలియచేసారు. 

అసలే గత రెండు మూడు సంవత్సరాలుగా ఏ కేటాయింపులు లేకుండా సుప్తావస్ధలో ఉంచడమే దారుణమనుకుంటుంటే, ఇప్పుడు ఈ నిర్ణయం బ్రాహ్మణ వ్యవస్ధకే

ప్రమాదకరంగా భయపడే పరిస్ధితిని కలిగించిందని సంఘం జాతీయ కార్యవర్గం  అభిప్రాయపడుతోందన్నారు.  

బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా నియమితులైన సీతంరాజు సుధాకర్ పూర్తి అజ్ఞాతంలోనే గడుపుతున్నారని, వారి ప్రమాణ స్వీకారం నుండి అన్ని పనులు రహస్యంగానే చేస్తున్నారు తప్ప ఇప్పటివరకు బహిరంగంగా దర్శన భాగ్యం

కల్గించడం లేదన్నారు. 

ఎక్కడా బ్రాహ్మణ కార్పోరేషన్ విషయంలో గాని, ప్రస్తుత జీవో విషయంలోగాని బ్రాహ్మణ వ్యవస్ధకు వివరణ కూడా ఇవ్వలేదని ఇది పూర్తి బాధ్యతారాహిత్యమని సంఘం అభిప్రాయపడిందన్నారు. 

ఇప్పటికైన చైర్మన్, ప్రభుత్వం పునరాలోచన చేసి బ్రాహ్మణ వ్యవస్థకు అనుకూల నిర్ణయాలు తీసుకోగలరని

దానిద్వార బ్రాహ్మణుల మద్దతు సంపూర్ణంగా పొందామని తెలియజేసారు. తక్షణమే ఆ జీవో ఉపసంహరించి యథాతథాస్ధితిని కొనసాగించాలని సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam