DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓడిపోతామనే భయంతోనే ఓట్ల గల్లంతు చేశారు : చంద్రబాబు పై మండిపడ్డ బొత్స

ఓడిపోతామనే భయంతోనే ఓట్ల గల్లంతు చేశారు : బొత్స 

విశాఖపట్నం, ఆగస్టు 3 , 2018 (DNS Online ): రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు 16 లక్షల ఓట్లను

తొలగింపచేశారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గురువారం నగరం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో

అయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కేవలం అయిదులక్షల ఓట్ల తేడాతో అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఈ సారి మళ్లీ అధికారం నిలుపుకోవటానికి 16 లక్షల ఓట్లు

తొలగింపజేశారని అన్నారు. దీని మీద తాము కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు, ముఖ్యంగా చంద్రబాబు వ్యతిరేకులు తమ ఓట్లు

ఉన్నాయో గల్లంతయ్యాయో చూసుకోవాలన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా మోసం దగా మాయలతోనే గడిచిందన్నారు. ఇపుడు మరోసారి జనాన్ని మోసగించటానికి వైకాపా మీదా, జగన్

మీదా బురద జల్లుతున్నారన్నారు. జగన్ కేసుల మాఫీకోసం బీజేపీకి అమ్ముడు పోయారని పదే పదే అంటున్న చంద్రబాబు గత నాలుగేళ్లలో బీజేపీకి అంటకాగినపుడు జగన్ మీద చర్య

ఎందుకు తీసుకోలేక పోయారనీ ప్రశ్నించారు. తన తొమ్మిదేళ్ల తొలి విడత పాలనలో ఒక్క ప్రాజెక్టుకి పిడికెడు సిమెంటు కేటాయించని చంద్రబాబు ఇపుడు వైఎస్ ప్రారంభించిన, 80

శాతం పూర్తయిన ప్రాజెక్టులను తానే కట్టిస్తున్నట్టు చెప్పుకోవటం దారుణమన్నారు. జగన్ కాపు రిజర్వేషన్ల మీద యూ టర్న్ తీసుకున్నాడంటున్న చంద్రబాబు తన

మేనిఫెస్టోలో పెట్టిన అంశాలమీద ఎన్ని టర్నులు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. నిరుద్యోగులకు బాబు వస్తే జాబు వస్తుందనీ, లేదా రెండు వేల భృతి వస్తుందనీ చెప్పిన

బాబు ఈ రోజు కేబినెట్లో ఇంకా దాని గురించి చర్చించామని చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు.

 

#dns #dns news #dns live #dnslive #dnsnews #dns media #dnsmedia #ysr congress #ysrcp #botsa #botsa satyanarayana  #vizag #visakhapatnam #visakha ysrcp #votes #missing votes

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam