DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోకరక్షణార్థం 1008 ఆవృత్తాలు క్షమాషోడశి పారాయణ 

*శ్రీరంగం నుంచి శ్రీకూర్మం వరకూ పాల్గొన్న శ్రీవైష్ణవ గోష్టి* 

*అఖిలభారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంఘం సహా నిర్వహణలో* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2021 (డిఎన్ఎస్):* లోకరక్షణార్థం, కొరోనా మహమ్మారి బారి  నుంచి సమస్త మానవాళిని రక్షించాలి అని శ్రీరంగనాథున్ని

ప్రార్థిస్తూ శ్రీవైష్ణవ గోష్టి 1008 ఆవృత్తాలు క్షమాషోడశి పారాయణ జరిపారు. తమిళనాడు కు చెందిన అనుష్ఠానమ్ నామ ప్రచారం సంఘం, అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యవంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గూగుల్  మీట్ ద్వారా ఈ పారాయణ ను నిర్వహించారు. 

వివిధ సమయాల్లో భగవంతుని పట్ల

జరిగిన దోషాలకు క్షమాపణ కోరుతు క్షమాషోడశి స్తోత్ర సహస్ర పారాయణాన్ని నిర్వహించినట్టు అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజీ తెలిపారు. మహోన్నతంగా జరిగిన ఆన్ లైన్ పారాయణ లో శ్రీకాకుళం జిల్లా లోని శ్రీకూర్మం క్షేత్రం నుంచి శ్రీరంగం క్షేత్రం వరకూ అన్ని ప్రాంతాల శ్రీవైష్ణవ

సంప్రదాయ పరులూ పాల్గొన్నట్టు తెలిపారు.  

ఈ గోష్టి కి  తిరునారాయణపురం (మేల్కొటే ) జీయర్ స్వామి మంగళాశాసనాలు లభించాయి. సంఘ గౌరవాధ్యక్షులు శ్రీపాంచరాత్ర ఆగమ విద్వాన్ శ్రీరామన్ భట్టాచార్యర్ (శ్రీరంగం), ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజి (గుంటూరు) , సమాచార శాఖ కార్యదర్శి డీఎన్ఎస్ శాయి (విశాఖపట్నం), నాలాయిర

ప్రబంధ పారాయణ ప్రచారకులు ఎస్ టి పి రామానుజాచార్యులు ( శ్రీకూర్మం)   ఉత్తరాంధ్ర కో కన్వీనర్ శృంగారం వెంకటాచార్యులు (శ్రీకాకుళం), తదితర ప్రాంతాల నుంచి సుమారు 500 మంది కి పైగా  సభ్యులు ఈ గోష్టి లో పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam